పటాస్ నుండి మొదలుకుని సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు దాదాపు అన్ని సినిమా లను సక్సెస్ చేసుకుంటూ వస్తున్న అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
అనీల్ రావిపూడి తదుపరి సినిమా బాలయ్య తో అంటూ వార్తలు వచ్చాయి.రామారావు గారు అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది.
ఆ సినిమా సంగతి క్లారిటీ రాకుండానే మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రవితేజ తో గతంలో రాజా ది గ్రేట్ సినిమా ను అనీల్ రావిపూడి తెరకెక్కించాడు.
ఆ సినిమా కు సంబంధించిన సీక్వెల్ ను ఇప్పుడు రవితేజ తో తీయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనీల్ రావిపూడి ఆ సినిమా ను సీక్వెల్ గా కాకుండా కొత్త కాన్సెప్ట్ తో రూపొందించబోతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రవితేజ మరియు అనీల్ రావిపూడిల కాంబో సినిమా గురించి వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అన్నట్లుగా అనిపిస్తున్నాయి.ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు అయిదు సినిమా లు ఉన్నాయి.
కనుక అనీల్ రావిపూడితో సినిమా అంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుందని అంటున్నారు.మరి అప్పటి వరకు అనీల్ రావిపూడి వెయిట్ చేయక పోవచ్చు.
కనుక అనీల్ రావిపూడి తన తదుపరి సినిమా ను రవితేజతో చేయక పోవచ్చు అంటున్నారు.వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాకుండానే సీక్వెల్.
మల్టీ స్టారర్ ఇంకా కొత్త కొత్త వార్తలు పుకార్లు ఏవో ఏవో వస్తూనే ఉన్నాయి.అనీల్ రావిపూడి ప్రస్తుతం చేస్తున్న సినిమా ఎఫ్ 3 ఆగస్టులో విడుదల కాబోతుంది.
ఆ తర్వాత తదుపరి సినిమా గురించిన వార్తలు వచ్చే అవకాశం ఉంది.ఇప్పుడు వస్తున్న వార్తలు అన్ని కూడా ఖచ్చితంగా పుకార్లే అంటూ ఆయన సన్నిహితులు నమ్మకంగా చెబుతున్నారు.