సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు వరుసగా హిట్లు కొడుతూనే ఉన్నాడు.అయితే ఈమధ్యనే తను స్క్రీన్ ప్లే అందించిన గాలి సంపత్ ఫ్లాప్ అయ్యింది.
అనీల్ కెరియర్ లో చూసిన మొదటి ఫెయిల్యూర్ ఇదే అని చెప్పొచ్చు.ఇక ప్రస్తుతం ఎఫ్ 2కి కొనసాగింపుగా ఎఫ్ 3 మూవీని చేస్తున్న అనీల్ రావిపుడి తన నెక్స్ట్ సినిమా కోసం పలువురి స్టార్స్ ను కలుస్తున్నట్టు తెలుస్తుంది.
అనీల్ హిరోల లిస్ట్ లో మహేష్, బాలకృష్ణ ఉన్నారు.అయితే లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడని తెలుస్తుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అనీల్ రావిపుడి సినిమా ప్లానింగ్ లో ఉన్నారట.ఈమధ్యనే బన్నీని కలిసి అనీల్ రావిపుడి కథ వినిపించాడని తెలుస్తుంది.
అనీల్ చెప్పిన కథకు అల్లు అర్జున్ ఇంప్రెస్ అయ్యాడట.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా తర్వాత కొరటాల శివ సినిమా లైన్ లో ఉంది.ఈ రెండు పూర్తయిన తర్వాత అనీల్ రావిపుడితో సినిమా ఉంటుందని టాక్.
మొత్తానికి అనీల్ మార్క్ ఎంటర్టైనర్ సినిమాతో బన్నీ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో చూడాలి.