ఎప్పుడూ ఎదో ఒక వివాదాస్పద పని చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు.అయితే తాజాగా అసెంబ్లీ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది అయినటువంటి మార్షల్స్ పై ప్రతి పక్ష నాయకుల చేయి చేసుకోవడం ప్రస్తుతం అసెంబ్లీ లో కలకలం రేపుతోంది.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మార్షల్స్ పై చేయి జేసుకున్నాడు.అంతేగాక యూస్ లెస్ ఫెలో అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు.
దీంతో అధికార పక్ష నాయకులు మార్షల్స్ అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల బంట్రోతులు కాదని వారు కేవలం స్పీకర్ ఆదేశాల మేరకు వారి విధులను నిర్వర్తిస్తున్నారని అలాంటి వారితో ఇలా ప్రవర్తించడం సరి కాదని విమర్శిస్తున్నారు.అయితే ఇందులో భాగంగా ఈ విషయం పై మంత్రి అనీల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ రాష్ట్రమంతా యూస్ లెస్ ఫెలో అనుకుంటున్న ఓ వ్యక్తి, 40 సంవత్సరాలు అనుభవం కలిగిన ఓ మార్షల్ అధికారిని యూస్ లెస్ ఫెలోఅనడం సరికాదని తప్పుబట్టారు.
అంతేగాక ఆ అధికారికి క్షమాపణ చెబితే హుందాగా ఉంటుందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు.
మరి కొందరైతే సభలో అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు నాయుడు కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నాడని, అలాగే వైకాపా పార్టీ కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇలాంటివి చేస్తున్నాడని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు.
.