సూపర్స్టార్ మహేష్బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వాటి పాట మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యుల్ అమెరికాలో స్టార్ట్ చేయాలని దర్శకుడు పరశురాం ప్లాన్ చేస్తున్నాడు.
దీనికి సంబంధించి బ్యాగ్రౌండ్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ చేసేశాడు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం తర్వాత మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.
ఇక వరుస సక్సెస్ లతో మంచి స్పీడ్ మీద ఉన్న మహేష్ బాబు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇప్పటికే హీరోయిన్ గా కీర్తి సురేష్ ని కన్ఫర్మ్ చేయగా విలన్ ఫైనల్ అయిపోతే షూటింగ్ ప్లాన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ ని విలన్ గా తీసుకోవాలని చాలా మంది పేర్లు పరిశీలించిన పరశురాం ఫైనల్ గా వెటరన్ హీరో అనిల్ కపూర్ దగ్గర ఆగినట్లు తెలుస్తుంది.
బ్యాంక్లో తీసుకున్న సొమ్మును తిరిగి కట్టకుండా పారిపోయే విలన్ల ఆట హీరో ఎలా కట్టించాడన్నది చిత్రకథ అని వినిపిస్తూ ఉండగా, ఇందులో విలన్ ఒక కార్పోరేట్ కింగ్ గా కనిపిస్తాడని టాక్ నడుస్తుంది.ఇలాంటి పాత్ర కోసం పర్ఫెక్ట్ విలన్ ఉండాలని అనిల్ కపూర్ను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తుంది.
దర్శకుడు పరశురాం అనిల్ కపూర్కు కథను కూడా వినిపించారట.ఇక ఆయనకి కూడా కథ నచ్చిందని కన్ఫర్మేషన్ ఇస్తే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది.