బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెంది దాదాపు 9 నెలలు అవుతున్నా సుశాంత్ మరణానికి సంబంధించిన అసలు కారణాలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదు.సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని వైద్యులు చెబుతున్నా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రశ్నకు ఎవరూ ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.
సుశాంత్ మృతి తరువాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి బెయిల్ పై విడుదలై వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు.
సుశాంత్ మృతి తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగంతో పాటు నెపోటిజం గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది.
అయితే సుశాంత్ మృతి తరువాత కొందరు సుశాంత్ అభిమానులు రియాను ట్రోల్ చేయగా మరి కొందరు అభిమానులు సుశాంత్ మాజీ లవర్ అంకితను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు.రోజులు గడుస్తున్నా సుశాంత్ అభిమానుల నుంచి ట్రోలింగ్ ఆగకపోవడంతో తాజాగా అంకిత సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అభిమానులకు తన లైఫ్ గురించి ఏం తెలుసని ఆమె ప్రశ్నించారు.సుశాంత్ తో తాను విడిపోయిన రోజు తనను ప్రశ్నిస్తున్న వాళ్లు ఎక్కడనున్నారని ఆమె అడిగారు.తాను తప్పు చేశానని అనుకోవద్దని.సుశాంత్ తన కెరీర్ లో ఎదగాలని భావించి తనకు దూరమయ్యాడని.సుశాంత్ అభిమానులు తనపై విమర్శలు చేయడం ఆపాలని ఆమె అన్నారు.సుశాంత్ తో విడిపోయిన సమయంలో తనకు ఎంతో బాధ కలిగిందని ఆమె వెల్లడించారు.
ఆ సమయంలో ఎంతో బాధ పడినా ఎవరినీ నిందించలేదని అంకిత చెప్పుకొచ్చారు.సుశాంత్ తో విడిపోయిన తరువాత తాను డిప్రెషన్ బారిన పడ్డానని.ఆ రోజులు తన జీవితంలో చీకటి రోజులని.అయితే తను ఎవరినీ నిందించలేదని.
తనపై విమర్శలు ఆపాలని అంకిత వెల్లడించారు.