ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ యానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించిన యానీ మాస్టర్ బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకుని సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు.
ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న ఈమె కొంత నెగిటివిటీని కూడా ఎదుర్కొన్నారు.బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న యానీ మాస్టర్ కరోనా బారిన పడిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేశారు.
ఈ సందర్భంగా యానీ మాస్టర్ మాట్లాడుతూ గత ఏడాది జనవరి 23వ తేదీ నేను కోవిడ్ బారి నుంచి బయట పడి నెగిటివ్ అనే రిపోర్ట్ వచ్చింది.అయితే ఈ ఏడాది జనవరి 24వ తేదీన మరోసారి పాజిటివ్ అని వచ్చింది అంటూ ఈమె తెలిపారు.
ఈ కరోనా ఏమైనా టైం మెయింటెన్ చేస్తుందా? అంటూ సందేహం వ్యక్తపరచడమే కాకుండా తనకు క్వారంటైన్ లో ఉండటం చాలా బోరింగ్ గా ఉంది అంటూ ఈమె తెలియజేశారు.
ఈ విధంగా క్వారంటైన్ లో ఉన్న యానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
ఈ క్రమంలోనే ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార కూడా యానీ మాస్టర్ ను పలకరించి తన క్షేమ సమాచారాలు అడిగింది.ఇక తనకు కరోనా సోకడంతో క్వారంటైన్ లో ఉండటం వల్ల చాలా బోర్ గా ఉందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు ఈ ఫోటో పై స్పందిస్తూ.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కంటెస్టెంట్ సన్నీకి ఏ మాత్రం సపోర్ట్ చేయలేదు కదా నీకు ఇలా కావాల్సిందే మంచి శాస్తి జరిగింది.అంటూ నెటిజన్లు శాపాలు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే యానీ మాస్టర్ఈ మెసేజ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నువ్వు ఇంకా చాలా ఎదగాలి అంటూ కామెంట్ చేశారు.అదేవిధంగా సన్నీ బాబా నాకు కరోనా తగ్గిపోయేలా ఏమైనా చేయొచ్చు కదా అంటూ సరదాగా కామెంట్ చేశారు.
మొత్తానికి యానీ మాస్టర్ కి సన్నీ ఫాన్స్ నుంచి శాపాలు మొదలయ్యాయని చెప్పవచ్చు.