తెలుగు బుల్లితెర ఫై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో ముగిసిన విషయం మనందరికి తెలిసిందే.
బిగ్ బాస్ షో ముగిసిన కూడా కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ ల మధ్య జరిగిన వివాదాలను అభిమానులు తవ్వుతూనే ఉంటారు.
అయితే హౌస్ లో ఎన్ని గొడవలు పడిన కూడా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్ లు అందరూ కలిసి ఉంటారు.కానీ వారి అభిమానులు మాత్రం ఒకరిపై మరొకరు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తుంటారు.
తాజాగా అనీ మాస్టర్ తన ఫ్యాన్ వార్ ట్రోలింగ్ ఫై అసహనం వ్యక్తం చేసింది.సంక్రాంతి పండుగ కోసం స్టార్ మా ఒక ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ లో పాల్గొంటున్నారు.ఇందులో భాగంగానే సన్నీ,మానస్ లు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు డాన్స్ వేశారు .ఈ క్రమంలోనే వారిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో మన్ సూన్ మీకు అని ఒక కొత్త హ్యాష్ ట్యాగ్ తో దుమ్ము లేపుతున్నారు.ఈ విషయంపై శ్రీ రామచంద్ర ఫ్యాన్స్ ట్రోలింగ్స్ స్టార్ట్ చేశారు.
ఇక వెంటనే సన్నీ, మానస్ ల అభిమానులు ఆ ట్రోలింగ్స్ పై అసహనం వ్యక్తం చేశారు.
ఎవరిని ఇలా పర్సనల్ గా తిట్టవద్దు, ట్రోలింగ్స్ వద్దు అని అంటారు మళ్లీ మీరే స్టార్ట్ చేస్తారు.మేము ట్రోల్స్ చేస్తే మా మీద పడి ఏడుస్తారు అంటూ సన్నీ,మానస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.ఈ విషయంపై అనీ మాస్టర్ రంగంలోకి దిగింది.ప్లీజ్ దయచేసి ఇలాంటి ట్రోలింగ్ నీ ఆపండి.నేను ఎప్పుడూ కూడా ఇలాంటి ట్రోలింగ్ నీ ఎంకరేజ్ చేయను.నా మీద కాని ఇతర కంటెస్టెంట్ ల మీద గానీ ఇలాంటి ట్రోల్స్ చేయకండి అంటూ అనీ మాస్టర్ వేడుకుంది.మరి అనీ మాస్టర్ కోరిక మేరకు అభిమానులు ట్రోలింగ్స్ ని ఆపుతారా.
లేదా అన్నది తెలియాలి అంటే వేచిచూడాల్సిందే మరి.
తాజా వార్తలు