తెలుగు రాష్ట్రాల్లో నేడంతా కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.రాగ రెండు రోజుల వరకు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ముఖ్యంగా ఏపీలో రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.పశ్చిమ మద్య బంగాళఖాతం మరియు ఒడిశా తీరాన అల్ప పీడనం ఏర్పడినది.
దాంతో ఏపీకి భారీ వర్షాల సూచన ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
భారీ వర్షాల కారణంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
రాగల రెండు మూడు రోజుల వరకు మత్య్సకారులు చేపల వేటకు వెళ్లక పోవడం మంచిది అంటూ హెచ్చరించారు.తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలో మీటర్ల చొప్పున గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది.
ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు సూచించారు.