‘అనుకున్నదొకటి….అయ్యిందొకటి బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్ట’ అనే సినిమా పాటలా తయారైంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి.
బోల్తా పడ్డ బుల్బుల్ పిట్టలు ఎవరయ్యా అంటే వైజాగ్ రియల్ఎస్టేట్ వ్యాపారులు.ఎందుకిలా దృశ్యం తిరగబడిందంటే…ఉమ్మడి రాష్ర్టం విడిపోగానే అన్ని రంగాల్లోని వారి కన్ను వైజాగ్ మీద పడింది.
ఉమ్మడి రాష్ర్టంలోనే అది ప్రముఖ నగరం.హైదరాబాద్ తరువాత దానిదే స్థానం.కాబట్టి అదే ఏపీ రాజధాని అవుతుందని భావించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోలోమంటూ అక్కడికి పరుగులు తీశారు.‘రియల్ బూమ్’ క్రియేట్ చేశారు.వీలైనంతవరకు దండుకోవాలని అపార్్టమెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు కట్టి అమ్ముకోవాలనుకున్నారు.జనం కూడా ఆసక్తి చూపించారు.మొదట్లో ఎగబడి ఇళ్లు కొన్నారు.కట్టుకున్నారు.
కాని రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యలో కడతానని బాబు ప్రకటించి అందుకోసం ఏర్పట్లు ముమ్మరం చేయగానే వైజాగ్ రియల్ బుగ్గ పగిలిపోయింది.కట్టిన అనేక ఇళ్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని సమాచారం.
భారీగా పెట్టుబడులు పెట్టిన రియల్ వ్యాపారులు తలకాయలు పట్టుకుంటున్నారట.ఒక్క వైజాగ్లోనే కాదు, ఏపీలోని చాలా నగరాల్లో రియల్ బూమ్ సృష్టించారు.
దీంతో చాలామంది ఓపెన్ లాండ్్స కూడా కొని బ్లాక్ చేసి పెట్టుకున్నారు.ఇప్పుడు వచ్చినకాడికి అమ్ముకోవల్సిన పరిస్థితి ఏర్పడిందట…!
.