ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విపక్షాలు ఎప్పటినుండో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.మరోపక్క ఏపీ ప్రభుత్వం మాత్రం పదవతరగతి పరీక్షలు అనేది విద్యార్థి భవిష్యత్తును నిర్దేశించేవి అని ఎట్టి పరిస్థితుల్లో కరోనా తీవ్రత ఉన్నాగాని అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఈ విషయం హైకోర్టు దాకా వెళ్లడంతో తాజాగా హైకోర్ట్.పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి తెలుపుతూ లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేయడం జరిగింది.
ఈ పరిణామంతో కరోనా పరిస్థితి నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.జూలై మాసంలో మళ్లీ పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది.
వాస్తవానికి జూన్ 7వ తారీకు నుండి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భాగించగా .కరోనా పరిస్థితులు ఇంకా అదుపులోకి రాని నేపథ్యంలో వాయిదా వేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.