ఏపీలో కర్ఫ్యూ సమయములో సడలింపులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ సమయంలో సడలింపులు ఇస్తూ ఉంది.ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కర్ఫ్యూ అమలు అవుతున్న సంగతి తెలిసిందే.

 Andhra Pradesh State New Curfew New Timings,  Andhra Pradesh, Curfew , New Timin-TeluguStop.com

అయితే జూన్ 21వ తారీకు నుండి 30 వ తారీఖు వరకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సమయాన్ని పొడిగిస్తూ కొత్త సడలింపులు అందిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈరోజు కోవిడ్ సమీక్ష సమావేశం జరిపిన సీఎం జగన్ .వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తో ఉన్నతాధికారులతో భేటీ అయి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.అయితే సాయంత్రం ఐదు గంటల గల దుకాణాలు మూసేయాలి అని .ఆరు గంటల లోపు ఇంటికి వెళ్లిపోవాలని ప్రజలకు సూచించింది.రాష్ట్రంలో కర్ఫ్యూను అమలు చేయటంతో.

చాలా వరకు కరోనా కట్టడి చేయగలిగినట్లు.మెరుగైన ఫలితాలు రాబట్టినట్లు ఈ సమావేశంలో మంత్రులతో.

ఉన్నతాధికారులతో సీఎం జగన్ పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ప్రస్తుతం అమలవుతున్న టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు టైమింగ్స్ కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube