జులై 19 నుండి ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 19 వ తారీకు నుండి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది.ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.18 వ తారీకు రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆ మరుసటి రోజు 19వ తారీఖు నుండి జులై 23వ తారీకు వరకు రాష్ట్రంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాలలో దాదాపు 10 నుండి 12 బిల్లులు ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

 Andhra Pradesh Monsoon Assembly Sessions From July 19 ,vizianagaram Mla , Andhra-TeluguStop.com

ఇదిలా ఉంటే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి స్థానంలో ఈ అసెంబ్లీ సమావేశాల నుండి విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామినీ.ఎన్నుకోనున్నట్లు సమాచారం.

 ఈ సమావేశాలలో పెగాశస్, ఫోన్ ట్యాపింగ్ పై చర్చ జరగనున్నట్లు అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి.అంత మాత్రమే కాదు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో “సేవా మిత్ర యాప్” ద్వారా.40 లక్షల మంది ఓట్లు తొలగించే ప్రయత్నం చేసినట్లు అసెంబ్లీ కమిటీ సభ్యుడు వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.కచ్చితంగా వీటన్నిటిపై రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో చర్చ జరగనున్నట్లు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube