ఇప్పుడు జగన్ చేసిన పనులు తప్పు కనుక .చేసిన చట్టాలు చెల్లవని హై కోర్ట్ లో విగిపోయే పరిస్థితి ఉంది.
కనుక అసెంబ్లీ లో మూడు రాజదానులు చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సరికాదు.
పెట్టుబడి దారులు ఆంధ్ర ప్రదేశ్ అంటే హడలిపోయే పరిస్థితి ఉంది .అందరి ప్రజాభిప్రాయలు తీసుకుని అమరావతి రాజధాని గా ప్రకటించాం.న్యాయ వ్యవస్థను తప్పు దారి పట్టించే విషయం తప్ప మరొకటి కాదు.మూడు రోజులు క్రితం నేను అసెంబ్లీ లో మూడు రాజధానులు చట్టం రద్దు చేయమని అడిగితే.
వ్యవసాయ మంత్రి పేయిడ్ ఆర్టిస్టులకోసమా అని అడిగారు.మంత్రి కనీసం రైతులు పై కనీస విలువలు ఇవ్వడం లేదు.
విశాఖ లోనైనా కార్యాలయాలు కట్టాలి గా ఇప్పటికే అమరావతి లో అన్ని సిద్ధంగా ఉన్నాయి గా.చంద్రబాబు మొదలు పెట్టారు కనుక సీఎం జగన్ కొనసాగించకూడదు అనే ఆలోచనలో ఉన్నారు.ఇది వైకాపా ప్రభుత్వం పరువు కాపాడుకునే చర్య.ఈ సమావేశంలో పుచ్చ విజయకుమార్, రాజమండ్రి నారాయణ ,ఎల్లపు శ్రీనివాసరావు, పొడుగు కుమార్, కోనేటి సురేష్,తదితరులు పాల్గొన్నారు.