ఏపీ లో ఉదృతం అవుతున్న కరోనా... ఒకేరోజు..!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దేశంలోని ఏపీ లో కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది.ఒకపక్క దేశవ్యాప్తంగా ఈ కరోనా కేసుల సంఖ్య 30 వేలకు పైగా నమోదు కాగా, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతుంది.

 Corona Cases Increasing In Ap, Corona Cases, Andhra Pradesh, Ap Health Bulletin,-TeluguStop.com

ఈ మహమ్మారి కారణంగా గడచినా 24 గంటల్లో వేలమందికి పరీక్షలు నిర్వహించగా 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా,44 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ వైరస్ ను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు.

ఈ క్రమంలో ఈ వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా విధించింది.అంతేకాకుండా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తుండడం తో తాజాగా కేసుల నమోదు ఎక్కువవుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా విడుదల అయిన బులిటెన్ లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.మరోపక్క ఈ మహమ్మారి తో జనాలు బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు.

ఎప్పుడు, ఎక్కడ,ఎలా ఈ మహమ్మారి విరుచుకుపడుతుందో అర్ధం కాక జనాలు భయాందోళనకు గురవుతున్నారు.

రాజు,పేద అన్న తేడా లేకుండా ఈ మహమ్మారి ప్రతి ఒక్కరిని కూడా వణికించేస్తుంది.

ఇప్పటికే పలువురు సెలబ్రిటీల తో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడిన వారిలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube