ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దేశంలోని ఏపీ లో కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది.ఒకపక్క దేశవ్యాప్తంగా ఈ కరోనా కేసుల సంఖ్య 30 వేలకు పైగా నమోదు కాగా, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతుంది.
ఈ మహమ్మారి కారణంగా గడచినా 24 గంటల్లో వేలమందికి పరీక్షలు నిర్వహించగా 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా,44 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ వైరస్ ను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు.
ఈ క్రమంలో ఈ వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా విధించింది.అంతేకాకుండా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తుండడం తో తాజాగా కేసుల నమోదు ఎక్కువవుతుంది.
ఈ క్రమంలోనే తాజాగా విడుదల అయిన బులిటెన్ లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.మరోపక్క ఈ మహమ్మారి తో జనాలు బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు.
ఎప్పుడు, ఎక్కడ,ఎలా ఈ మహమ్మారి విరుచుకుపడుతుందో అర్ధం కాక జనాలు భయాందోళనకు గురవుతున్నారు.
రాజు,పేద అన్న తేడా లేకుండా ఈ మహమ్మారి ప్రతి ఒక్కరిని కూడా వణికించేస్తుంది.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీల తో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడిన వారిలో ఉన్నారు.