ఏపీ సీఐడీ రఘురామ కృష్ణంరాజు కాలి గాయాలపై సంచలన కామెంట్స్ చేసింది. పోలీసు కస్టడీలోనే రఘురామకష్ణంరాజు కాళ్లకు గాయాలు అయినట్లు ఆర్మీ హాస్పిటల్ ఎక్కడా చెప్పలేదని పేర్కొంది.
సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సిబ్బంది న్యాయస్థానానికి ఇచ్చిన నివేదికలో ఇదే వెల్లడించినట్లు సీఐడీ పేర్కొంది.దాదాపు మూడు సార్లు నివేదిక పరిశీలించి వైద్యులు.
కోర్టుకు సమర్పించారని వాటిలో ఎక్కడా కూడా జైల్లో గాయాల అయినట్టు వెల్లడించలేదని స్పష్టం చేసింది.
అంతకుముందు సీఐడీ న్యాయస్థానంలో హాజరుపరిచాడానికి ముందు జారీచేసిన ఫిట్నెస్ ధ్రువపత్రం అదేవిధంగా గుంటూరు జిజిహెచ్ వైద్యులు బృందం హైకోర్టు కి ఇచ్చిన నివేదికలో ఎక్కడా కూడా గాయాలు ఉన్నట్టు పేర్కొనలేదని వివరించింది.
సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు సీఐడీ స్పష్టం చేసింది.ఈ సందర్భంగా రఘురామ కి గాయాలు ఉన్నట్టు సైనిక హాస్పిటల్ ధృవీకరించినట్లు చెప్పటం సరైనది కాదని సీఐడీ ఖండించింది.