ప్రతి రోజూ బాబు మీటింగులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి రోజూ మీటింగులు పెడుతున్నారట….! ఎవరితో? మంత్రులతోనా? కాదు.పార్టీ నాయకులతోనా? కాదు.కార్యకర్తలతోనా? కాదు.ఏపీ ఏసీబీ, ఇంటెలిజెన్స్ అధినేతలతో, ముఖ్య పోలీసు అధికారులతో మీటింగులు పెడుతున్నారు.ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మీద చర్చిస్తున్నారు.ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.తెలంగాణ ఏసీబీ అధికారులు చాలా వేగంగా ముందుకు పోతుండటంతో బాబుకు ఆందోళన ఎక్కువవుతోంది.

 Ap Acb, Intelligence Officials Meet Naidu-TeluguStop.com

డీఐజీ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో ‘సిట్‌’ ఏర్పాటు చేసినా అది ఎంతవరకు ఫలితమిస్తుందో తెలియదు.ఏపీ తరపున ఇప్పటివరకు జరిగిన పని ఒక్కటే.

అది కేసీఆర్‌ కుటుంబ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీ-న్యూస్‌కు నోటీసు ఇవ్వడం.నోటీసు ప్రకారం ఆ ఛానెల్‌ మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలి.

ఇవ్వకపోతే ఏపీ పోలీసులు ఏం చేస్తారో తెలియదు.బాబుకు రేపో, ఎల్లుండో తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు ఇస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో బాబు మీటింగుల మీద మీటింగులు పెట్టి పోలీసు అధికారులను హడలెత్తిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం వద్ద బలమైన ఆధారాలున్నాయి.కాని ఏపీ సర్కారు దగ్గర అంత బలమైన ఆధారాలున్నాయా? అనేది అనుమానమేనని కొందరు టీడీపీ నాయకులే అంతర్గతంగా వాఖ్యానిస్తున్నారు.మరి ఏపీ పోలీసు అధికారులు ఏం చేసి బాబును రక్షిస్తారో తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube