అదేంటి సరిగానే చదివామా ? అని అనుకుంటున్నారా.ఒకింత ఆశ్చర్య పోతున్నారా! నిజమే.
మీరు చదివింది నిజమే! రాజధాని అమరాతి విషయంలో ఇక్కడి రైతులను, మహిళలను ఇబ్బంది పెడుతున్నామని, ఇది సుతరామూ అంగీకారం కాదని.తమను క్షమించాలని వైసీపీకి చెందిన ఓ వర్గం నాయకులు ఇక్కడిరైతులకు, రైతు ప్రతినిధులకు, అమరావతి జేఏసీ ప్రతినిధులకు ఫోన్లు చేసి.
ఊరడించారని పెద్ద ఎత్తున టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది.వాస్తవానికి అమరావతి విషయంలో వైసీపీ నాయకులు ఏ ఒక్కరూ కూడా మాట్లాడడం లేదు.
మాట్లాడినా.భ్రమరావతి.శ్మశానం.ఏముంది.ఫ్లాప్ అయిన మూవీ.అంటూ కామెంట్లు చేస్తున్నారు తప్ప.సానుకూలంగా మాట్లాడడం కానీ.ఇక్కడ ప్రజలను, రైతులను ఊరడించేలా ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు.
దీంతో ఇక్కడ రైతులు, మహిళలు ప్రజలు కూడా వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, హఠాత్తుగా వైసీపీలో.
అమరావతికి అనుకూలంగా ఓ వర్గం .ఇక్కడి రైతులకు పోన్లు.చేసి.“మా వాళ్లు చేసింది తప్పే! మేం ఒప్పుకొంటున్నాం.మీరు ఆందోళన విరమించండి.న్యాయ పోరాటం కొనసాగించండి“ అంటూ ఉచిత సలహాలు విసురుతున్నారని ఈ మీడియా పేర్కొంది.
దీనికి కారణం.రెండు రోజుల కిందట రాష్ట్రంలో అల్పపీడనం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురిసాయి.
దీంతో అనేక జిల్లాలు.వరదలో చిక్కుకున్నాయి.
ఈ క్రమంలోనే అమరావతి మునిగిపోయిందని, హైకోర్టు.తదితర కీలక భవనాల చుట్టూ నీరు చేరి చెరువులను తలపిస్తోందని కొందరు వైసీపీ నాయకులు, ఎంపీలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.ఇదితీవ్ర వివాదంగా మారింది.
దీంతో రైతులు.
మహిళలు .వైసీపీపై విరుచుకుపడ్డారు.ఇక్కడి భవనాలు కాదు కదా.రోడ్ల మీద జీబ్రా గీతలు కూడా తడవలేదని పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.మీరు అమరావతిని ముంచడంలేదని.ఏకంగా ఆంధ్రానే ముంచుతున్నారని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో కొందరు వైసీపీ నేతలు ఫోన్లు చేసి ఊరడించారని బాబు అనుకూల మీడియా రాసుకొచ్చింది.మరి ఇదే నిజమైతే.
సంచలనమే.!!
.