తెలుగు వారికి కార్తీక మాసం ఎంతో ముఖ్యమైన మాసంగా భావిస్తారు.కార్తీక దీపాలు, పూజలు వ్రతాలతో ఆ మాసం మొత్తం ఎంతో దేదీప్యమానంగా ఉంటుంది.
తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే కార్తీక మాసం జరుపుకోకుండా ఉండరు.ఇదిలాఉంటే కార్తీక మాసంలో ముఖ్యంగా అందరూ కలిసి జరుపుకునే వనసమారాధన బంధాలకి,మానవ సంబంధాలకి నిలయంగా ఉంటుంది.
అందుకే కార్తీక మాసంలో అందరూ కలిసి కట్టుగా వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు.అయితే ఎల్లలు దాటినా సరే ప్రవాసాంధ్రులు మాత్రం మన సంస్కృతీ సాంప్రదాయలని ఏ మాత్రం విడిచిపెట్టలేదు , మర్చిపోలేదు, అందుకే అమెరికాలో సైతం కార్తీక మాసం ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
వన భోజనాలు ఏర్పాటు చేసుకుని ఎంతో సంతోషంగా గడిపారు.
అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో రిడ్జ్ ల్యాండ్ నగరంలో స్థానికంగా ఉన్న ప్రవాసాంధ్రులు కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు.సుమారు 200 మంది తెలుగు వారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ముందుగా తులసి, ఉసిరి మొక్కలకి పూజలు చేసి , తెలుగు వంటలు తయారు చేసుకుని, ఆరగించారు.
పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరూ ఆట పాటలతో సంతోషంగా గడిపారు.విజేతలకి నిర్వాహకులు బహుమతులు అందచేశారు.