నేపాల్ వెళ్లి ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల సమాచారాన్ని వారి బంధువులకు ఎప్పటికప్పుడు చేరవేయడానికి, వారు అడిగిన సమాచారం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోలు రూములు ఏర్పాటు చేసింది.హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో కంట్రోలు రూములు ఏర్పాటు చేశారు.
ఇవి ఇరవైనాలుగు గంటలూ పనిచేస్తాయి.నేపాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు.
నేపాల్లో ఉన్న తెలుగువారిని సురక్షితంగా రాష్ర్టానికి రప్పించాలని ఆదేశించారు.ఆయన స్వయంగా విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు.
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి యాభైరెండు మంది, విజయవాడ నుంచి నలభై మంది నేపాల్కు పర్యాటకులుగా వెళ్లారు.హుద్హుద్ తుపాను సమయంలో, ఉత్తరాఖండ్లో రెండేళ్ల క్రితం వచ్చిన వరదల్లో తెలుగువారు చిక్కుకుపోయిన సమయంలో చంద్రబాబు చేసిన కృషి ప్రశంసలు పొందింది.
అప్పుడు అధికారంలో లేకపోయినా పార్టీ నిధులు ఖర్చు చేసి హెలిక్యాప్టర్లను పంపి బాధితులను ఢిల్లీకి తెచ్చారు.అక్కడి నుంచి రైళ్లలో సొంత ప్రాంతాలకు చేర్చారు.
నాయకుడైనవాడికి ఇలాంటి చొరవ అవసరం.