ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో కులాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న వారి పై పరువు హత్యలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.కానీ వీరి ప్రేమకు మాత్రం ఎలాంటి కుల,మతాలు అడ్డు రాలేదు, రాష్ట్రం దాటి కాదు ఏకంగా దేశం దాటి వారి ప్రేమ చిగురించింది.
పరిచయం కాస్తా స్నేహంగా మారి ,స్నేహం ప్రేమగా, ఆ ప్రేమ మూడు ముళ్ల బంధానికి దారితీసింది.వీర ప్రేమ గురించి ఇంట్లో వారికి తెలియజేయడంతో ఎటువంటి ఆంక్షలు విధించకుండా వారి ప్రేమబంధాన్ని మూడుముళ్ల బంధంతో ఒక్కటి చేసిన ఘటన బెజవాడలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.
రైల్వే డిఎస్పీ గా పనిచేస్తున్న అశోక్ కుమార్, లక్ష్మీ మహేశ్వరి దంపతుల కుమారుడు వివేకానంద రామన్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే అతనికి ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అమ్మాయి ఫ్రోజ్ షిరిన్ తో పరిచయం ఏర్పడింది.కొద్దిరోజులకు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఆ ప్రేమ ద్వారా జీవితంలో ఇద్దరు ఒకటి కావాలని నిశ్చయించుకున్నారు.
అనుకున్న విధంగానే వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో ద్వారా ఆంధ్ర అబ్బాయి, ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి పెళ్లి పీటలు ఎక్కారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం మూడుముళ్ల బంధంతో, ఏడడుగులు నడిచి ఈ జంట ఒక్కటయ్యారు.ఎంతోమంది బంధువులను పెళ్లికి పిలిచి అంగరంగ వైభవంగా వీరి వివాహ కార్యక్రమాన్ని జరిపించారు.పెళ్లికి వచ్చిన వారందరూ నిండుమనసుతో వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వరుడు మాట్లాడుతూ అమ్మాయి తనకు నచ్చడంతో ఇంట్లో వారికి ఈ విషయం తెలియజేశాము.వారు కూడా మా పెళ్లికి ఒప్పుకొని పెళ్లి జరిపించడం ఎంతో ఆనందంగా ఉందని వివేకానంద తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిని ఈ విధంగా ఆంధ్ర అబ్బాయి పెళ్లి చేసుకోవడంతో వీరి పెళ్లి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.