బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ ప్రస్తుతం పట్టాలెక్కిన విషయం తెల్సిందే.నితిన్ హీరోగా రూపొందుతున్న అంధాదున్ రీమేక్ లో కీలక పాత్రలో తమన్నా నటించబోతుంది.
ఇక ఈ సినిమా లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను నితిన్ చేయబోతున్నాడు.సినిమా అన్ని భాషల వారికి బాగా నచ్చే అవకాశం ఉంది.
కనుక సినిమాను ఇప్పుడు మలయాళంలో కూడా రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నారు.ఈ సినిమా ను మలయాళంలో యంగ్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ హీరోగా రూపొందబోతుంది.
ఆయుష్మాన్ ఖురానా పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించబోతుండగా హీరోయిన్ రాధిక ఆప్టే పాత్రను మన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా చేయబోతున్నట్లుగా మలయాళ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రీమేక్ లో నటించేందుకు గాను రష్మిక ఏకంగా కోటిన్నరకు పైగా పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
కాస్త బోల్డ్ గా నటించడంతో పాటు దర్శక నిర్మాతలు కోరిన డేట్లను ఇచ్చినందుకు గాను ఏకంగా కోటిన్నర పారితోషికంను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఇక ఈ అమ్మడికి రెండు కోట్లకు పైగా తెలుగు నిర్మాతలు ఇస్తున్నారు.
అయినా కూడా అంధాదున్ రీమేక్ పై ఆసక్తితో అక్కడ నటించేందుకు ఒప్పుకుంది.ఇక ఈమె తెలుగులో కూడా పలు సినిమాలు చేస్తోంది.
మొదటగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.ఆ తర్వాత నాని హీరోగా రూపొందబోతున్న ఒక సినిమా కు సంబంధించి ఓకే చెప్పింది.
ఇదే సమయంలో తమిళ సినిమాల్లో కూడా ఈమె నటిస్తుంది.ఇటీవలే బాలీవుడ్ సినిమా ఆఫర్ కూడా దక్కించుకుంది.
ఒకే సారి అయిదు భాషల్లో నటిస్తున్న ఏకైక హీరోయిన్ ఈ అమ్మడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
.