తెలుగులో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైంలోనే తన అందంతో విశేషంగా అభిమానులని సొంతం చేసుకున్న యాంకర్ అనసూయ.జబర్దస్త్ షోతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోగా క్షణం సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా మంచి ఆఫర్స్ ని టాలీవుడ్ లో ఒడిసిపట్టుకుంటుంది.
ఇక రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర అనసూయ కెరియర్ గ్రాఫ్ ని మార్చేసింది.స్టార్ హీరోల చిత్రాలలో స్పెషల్ పాత్రల కోసం దర్శకులు అందరూ ఫస్ట్ ఛాయస్ గా అనసూయనే ఎంచుకుంటున్నారు.
అయితే రంగమ్మత్తకి రంగస్థలం తర్వాత ఆ స్థాయిలో ఇప్పటి వరకు మరొక పాత్ర పడలేదు.</br>
ఇదిలా ఉంటే క్రియేటివ్ డైరెక్టర్ గా టాలీవుడ్గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత మరాఠా సినిమా అయినా నట సామ్రాట్ ని తెలుగులో రంగ మార్తాండగా రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలలో నటిస్తున్నారు.అలాగే కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక సీరియల్ రోల్ చేస్తుననాడు.
ఆ క్యారెక్టర్ కి సంబందించిన లుక్ కూడా బయటకి వచ్చింది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయని ఓ కీలక పాత్ర కోసం కృష్ణవంశీ ఎంపిక చేసాడని తెలుస్తుంది.
తనకి ఇష్టమైన దర్శకుడు పిలవడంతో అనసూయ కూడా మరో మాట చెప్పకుండా వెంటనే ఒకే చెప్పేసిందని సమాచారం.