ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
కరోనా మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదైనా మరణాలు మాత్రం తక్కువగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతూనే మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి.
అయితే కరోనా క్లిష్ట పరిస్థితులలో వలస కార్మికుల వ్యధలు ఎంతటివో మనం మెదటి వేవ్ లో చూసాం.అయితే ఈ సమయంలోనే తమ సొంత ఊళ్లకు పిల్లా పాపలతో కలిసి కాలి నడకన వెళ్తున్న దృశ్యాలు అప్పట్లో ఎంతలా దేశ ప్రజలను కలసి వేసాయో మనం చూసాం.
ఇక ఆ సమయంలో వలస కార్మికుల పట్ల దేవుడిగా మారాడు సోనూసూద్.తన స్వంత ఖర్చులతో బస్సులు వేయించి వలస కార్మికులను తమ స్వంత ఊళ్లకు తీసుకెళ్లాడు.
ఇక ఈ పనితో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సోనూసూద్ పేరు మారుమ్రోగిపోయింది.ఇక రెండో వేవ్ లో కూడా ఆక్సిజన్, బెడ్స్ ఏవీ లేకున్నా నిమిషాల వ్యవధిలో ఏర్పాటు చేయిస్తూ మరో సారి తన గొప్ప మనసు చాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ఇక కరోనా బాధితులను ఆదుకునేందుకు ఇక సోనూసూద్ ఫౌండేషన్ కు డైరెక్ట్ గా విరాళాలు పంపిస్తున్నారు.ఇప్పుడు ఈ జాబితాలో యాంకర్ వింధ్య కూడా చేరింది.
కాని అందరిలా తన డబ్బులను సోనూసూద్ ఖాతాలో జమ చేయకుండా తన దగ్గర ఫ్యాషన్ వేర్ ఖరీదైన దుస్తులను వేలం వేసి ఆ డబ్బును సోనూసూద్ ఫౌండేషన్ కు విరాళం ఇవ్వనున్నది.ఈ విషయాన్ని స్వయంగా యాంకర్ వింధ్య తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.