బుల్లితెర యాంకర్లలో కొన్ని జోడీలకు అభిమానులు ఉన్నారు.ఆ జోడీల గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వైరల్ అయిన గాసిప్స్ వల్ల ఆ జోడీల మద్య ఏదో ఉందని జోరుగా ప్రచారం జరిగింది.
అలా వైరల్ అయిన జోడీల్లో రవి శ్రీముఖి జోడీ కూడా ఉంది.కెరీర్ మొదట్లో లాస్యతో కలిసి రవి ఎక్కువ షోలు, ప్రోగ్రామ్ లు చేశారు.
అయితే రవి, లాస్య మధ్య విభేదాలు రాగా పటాస్ షో ద్వారా రవి, శ్రీముఖి పాపులర్ అయ్యారు.
రవి శ్రీముఖిపై వేసే పంచ్ లు, శ్రీముఖి రవిపై వేసే కౌంటర్లు పటాస్ షోకు మంచి టీఆర్పీ రేటింగ్ లు తెచ్చిపెట్టాయి.
ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమైన ఈ షో ఆ ఛానల్ కు కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది.అనంతరం శ్రీముఖికి బిగ్ బాస్ షోలో అవకాశం రావడం, శ్రీముఖి పటాస్ షో నుంచి తప్పుకోవడం జరిగాయి.
అయితే బిగ్ బాస్ షో నుంచి శ్రీముఖి బయటకు వచ్చిన తరువాత రవి, శ్రీముఖి కలిసి షోలు చేస్తారని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.
ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గత ఏడాది కాలంలో వీళ్లిద్దరూ కలిసి ఎలాంటి షోలు కలిసి చేయలేదు.అయితే తాజాగా విడుదలైన క్యాష్ షో ప్రోమోలో యాంకర్ వర్షిణి శ్రీముఖి, రవి మధ్య గొడవలు ఉన్నాయని చెప్పకనే చెప్పేసింది.ఈ ప్రోగ్రామ్ లో వర్షిణి తల్లితో పాటు రాగా స్కిట్ చేస్తూ వర్షిణి తన తల్లి పాత్రలో వర్షిణి తల్లి ఆమె పాత్రలో చేశారు.
రవి ఇంట్లో పార్టీ ఉందని అనసూయ, శ్రీముఖి వస్తారంటూ వర్షిణి తల్లి చెప్పగా వెంటనే వర్షిణి రవి ఉంటే శ్రీముఖి రాదని చెప్పింది.అలా రవికి శ్రీముఖికి మధ్య ఉన్న దూరాన్ని ఆమె బయటపెట్టింది.
పటాస్ షోకు శ్రీముఖి దూరమైన తరువాత కొంతకాలం పాటు వర్షిణి ఆ కార్యక్రమానికి యాంకర్ గా చేసిన సంగతి తెలిసిందే.