యూట్యూబ్ ఛానెళ్లకు యాంకర్ గా వ్యవహరించి శ్వేతారెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.శ్వేతారెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ కొంతమంది జనసైనికులమని చెబుతూ సోషల్ మీడియాలో పిచ్చి కుక్కల్లా వాగుతున్నారని శ్వేతారెడ్ది వెల్లడించారు.
తనపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారని శ్వేతారెడ్డి పేర్కొన్నారు.పవన్ పార్టీ పెట్టి సరైన విధంగా ముందుకు తీసుకెళ్లలేదని అందువల్లే జేడీ లక్ష్మీనారాయణ, దిలీప్ సుంకర్ వెళ్లిపోయారని శ్వేతారెడ్డి వెల్లడించారు.
పార్టీ స్టార్ చేసిన సమయంలో ఉన్న వ్యక్తి కూడా వెళ్లిపోయాడని శ్వేతారెడ్డి అన్నారు.రాజకీయం అంటే ఒక పార్టీ తప్పు చేస్తే ఇంకో పార్టీ తిడుతుందని బురద పూసుకోవడానికి సిద్ధంగా ఉండాలని శ్వేతారెడ్డి తెలిపారు.
రాజకీయం మొదలైనప్పటి నుంచి ఇదే సాంప్రదాయం కొనసాగుతోందని శ్వేతారెడ్డి అన్నారు.మీలాంటి వాళ్లు రెచ్చగొట్టడం వల్ల మాలాంటి వాళ్లు ఇలా తయారవుతున్నారని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు.
పవన్ కొంతసేపు చంద్రబాబు మరికొంత సేపు మరొకరి చంక ఎక్కుతున్నాడని శ్వేతారెడ్డి అన్నారు.మోదీ పవన్ ఉంటేనే పార్టీ బ్రతుకుతుందని చెప్పలేదని శ్వేతారెడ్డి పేర్కొన్నారు.పరిటాల రవి గుండు కొట్టించి మూడు నామాలు పెట్టి గాడిద మీద ఊరేగించటాన్ని మరిచిపోయావా అంటూ శ్వేతారెడ్డి ప్రశ్నించారు.అవి పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకోవాలని శ్వేతారెడ్డి వీడియోలో వెల్లడించారు.
నేను అన్ని ఆర్గనైజేషన్స్ లో నిఖార్సుగా పని చేశానని శ్వేతారెడ్డి అన్నారు.ప్రశ్నిస్తా అని చెప్పిన పవన్ బద్వేలులో ఎందుకు పోటీ చేయించడం లేదని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు.దమ్ము ఉంటే పవన్ పోటీ చేయిస్తే బాగుంటుందని శ్వేతారెడ్డి అన్నారు.మహిళలు ప్రశ్నిస్తే గౌరవంగా మాట్లాడాలని శ్వేతారెడ్డి కోరారు.పవన్ కళ్యాణ్ అభ్యర్థిని ప్రకటిస్తాడని జనసేనలో బుర్ర ఉన్నవాళ్లు భావిస్తున్నారని కానీ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా చేస్తున్నారని శ్వేతారెడ్డి అన్నారు.