టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ నంబర్ 1 యాంకర్ గా ప్రతిభతో ఎదిగిన యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే ఆ యాంకర్ సుమ మాత్రమేనని చెప్పాలి.ఇతర యాంకర్లతో పోలిస్తే రెమ్యునరేషన్ పరంగా కూడా సుమ టాప్ లో ఉంటారనే సంగతి తెలిసిందే.
ఛానల్ తో సంబంధం లేకుండా అన్ని ఛానల్స్ లో షోలతో బిజీగా ఉండే సుమ ఈ ఛానల్ ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా అన్ని ఛానెల్స్ లో కనిపిస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించారు.
తాజాగా యాంకర్ సుమ థియేటర్లో టీ, ట్రిప్స్ అమ్మారు.
క్యాష్ షోలో భాగంగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం సుమ టీ, టిఫిన్స్ అమ్మడం గమనార్హం.తాజాగా క్యాష్ ప్రోమో రిలీజ్ కాగా సీరియల్ నటులు ప్రియాంక నాయుడు, రాజ్, మహేశ్వరి, రాజేష్ క్యాష్ షోకు వచ్చారు.
షోలో స్కిట్ లో భాగంగా సుమ ప్లాస్క్ పట్టుకుని ఎంట్రీ ఇవ్వగా నాక్కూడా కొంచెం టీ అని సినిమా హాల్ లో కూర్చున్న లేడీ అడుగుతుంది.
సుమ పక్కన ఉన్న వ్యక్తి ఏంటి మా వదిన టీ అమ్మేదానిలా కనిపిస్తుందా అని రాజ్ చెబుతాడు.
ఇదేంటి సీటు ముందుకెళ్లట్లేదు అనగా మనం వచ్చింది బాల్కనీకి కాదని బెంచికి అని రాజ్ చెప్పడంతో సుమ అవాక్కవుతుంది.ఆ తరువాత తనతో ఉన్నవాళ్లకు సుమ పకోడీ ఇవ్వగా మాక్కూడా పకోడి ఇవ్వండమ్మా అని ఒక వ్యక్తి అడుగుతాడు.
ఏంట్రా మా వదిన నీకు పకోడీలు అమ్మేదానిలా కనిపిస్తుందా అంటూ రాజ్ సుమ పరువు తీసేశాడు.
ఆ తరువాత సుమ చకోడీలు తనతో ఉన్నవాళ్లకు పంచుతుండగా ఒక అమ్మాయి వెనుకనుంచి తనకు చకోడీలు అడుగుతుంది.ఆ తరువాత సుమ టీ పోసి ఇస్తుండగా ఒక వ్యక్తి పది రూపాయలు ఇచ్చి నాకు కూడా టీ ఇవ్వమని అడుగుతాడు.ఒక టీకే పది రూపాయలు వస్తే ఈసారి రెండు, మూడు ప్లాస్కులు తీసుకొస్తానని 200, 300 వస్తాయని సుమ అంటారు.
ఆ తర్వాత ఒక అమ్మాయి మీ వదిన థియేటర్లలో టీ అమ్మేదానిలా ఉందంటూ సుమ పరువు తీసేయడం గమనార్హం.