గడిచిన 15 సంవత్సరాల నుంచి బుల్లితెరపై నంబర్ వన్ యాంకర్ గా సుమ వరుస షోలు, ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులకు సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం ఈటీవీలోని షోలతో బిజీగా ఉన్న సుమను నెటిజన్లు ఒక విషయంలో ట్రోల్ చేస్తున్నారు.కెరీర్ తొలినాళ్ల నుంచి వివాదాలకు దూరంగా ఉన్న సుమ చేసిన ఒక పని ఆమె అభిమానులకే నచ్చడం లేదు.
స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలుగుతున్న సుమ నిన్న మంత్రి కేటీఆర్ ను కలిశారు.అనంతరం సోషల్ మీడియాలో కేటీఆర్ గారితో మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందని.
కేటీఆర్ నాయకత్వ హోదాలో మాట్లాడే విధానం ఎంతో బాగుందని సుమ ప్రశంసించారు.కేటీఆర్ మాట్లాడే విధానం, నిబద్ధత అద్భుతం అని ప్రశంసించారు.
సుమ కేటీఆర్ తో ఒక ఇంటర్యూ చేశారని అందుకే కలిశారని సమాచారం.
అయితే సుమ కేటీఆర్ ను కలవడంలో తప్పేం లేకపోయినా జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల సమయంలో కలవడం వల్ల సుమ పరోక్షంగా ఒక పార్టీకి మద్దతు ఇచ్చినట్టు అవుతుందని.గతంలో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయని సుమ ఇతర రాజకీయ పార్టీల అభిమానులకు దూరమయ్యే అవకాశం ఉందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సుమ రాజకీయాలకు సంబంధించిన అంశాలకు దూరంగా ఉంటారని చెబుతున్నారు.
అయితే కొందరు సుమ అభిమానులు మాత్రం సుమ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని సుమ బుల్లితెరపైనే కాదు రాజకీయాల్లో సైతం సత్తా చాటే అవకాశం ఉందని ప్రస్తుతం కాకపోయినా భవిష్యత్తులోనైనా రాజకీయాల్లో అడుగుపెడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.మరి అభిమానులు కోరుకుంటున్నట్లు సుమ భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.