మన చిత్ర పరిశ్రమకు చెందిన వారికి ఈ మధ్య కాలంలో కరోనా సోకడం పరిపాటిగా మారిపోయింది.చాలా రోజుల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులకు కరోనా వైరస్ సోకుతుండడం గమనిస్తూనే ఉన్నాం.
కరోనా వైరస్ కారణంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని చివరికి ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది.అయితే కరోనా వైరస్ సోకిన వారు కూడా అనేకమంది కోలుకున్నవారు ఉన్నారు.
దర్శకధీరుడు రాజమౌళి, హీరోయిన్ తమన్నా, బండ్ల గణేష్, హీరో రాజశేఖర్ కుటుంబం ఇలా అనేక మంది కరోనా నుండి కోలుకున్నారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆచార్య షూటింగ్ కోసం పాల్గొనటానికి ముందుగా కరోనా టెస్ట్ చేయించుకుంటే అందులో ఆయనకు పాజిటివ్ రావడంతో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.
ఇక ఇక తాజాగా యాంకర్ సుమ కరోనా టెస్ట్ చేయించుకుంది.
అయితే ఎందుకో తెలుసా.? అదేమిటంటే గతవారం బిగ్ బాస్ షో కి ఆవిడ హాజరైన సంగతి తెలిసిందే.ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ యాంకర్ సుమ.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇచ్చిన వారందరు ముందుగా కరోనా టెస్ట్ చేయించుకుని ఆ తర్వాత రిజల్ట్ నెగెటివ్ అని వస్తే మాత్రమే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది.లేకపోతే నో ఎంట్రీనే.అందుకోసమే యాంకర్ సుమ కూడా కరోనా టెస్ట్ చేయించుకుంది.అయితే ఈ కరోనా టెస్ట్ సమయంలో తీసిన వీడియోను ఆవిడ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
ఈ వీడియోకి సంబంధించి తాను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక ఏం జరిగిందో మీకు తెలుసు.
కానీ వెళ్ళక ముందు ఏం జరిగిందో మీరే చూడండి అంటూ ఈ పోస్టు తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అందులో యాంకర్ సుమ రిజల్ట్ ఎంత సేపు పడుతుంది అనగా.
కేవలం పది నిమిషాలు పడుతుంది అని పరీక్ష చేసే వారు తెలిపారు.ఇలా కరోనా టెస్ట్ చేయించుకుని నెగిటివ్ వచ్చిన తర్వాతనే ఆవిడ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేసింది.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వచ్చాక ఆవిడకు కరోనా భయం పట్టుకుంది.దీనికి కారణం హీరో నాగార్జున ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవితో కలిసి పాల్గొన్నారు.
తాజాగా హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు చిరంజీవి గారితో కలిసి ఉన్నవారు కాస్త భయపడుతున్నారు.చూడాలి మరి ఇంకా ఎంత మందికి కరోనా పాజిటివ్ బయటికి వస్తుందో.