బుల్లితెర యాంకర్లలో ఒకరైన సుమ ప్రస్తుతం క్యాష్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా క్యాష్ షో ఈ వారం ప్రోమో రిలీజ్ కాగా రాఖీ స్పెషల్ గా రిలీజైన ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఢీ డ్యాన్సర్ పండు, జాఫర్, భాను శ్రీ, సాకేత్ ఈ షోకు తోబుట్టువులతో కలిసి హాజరయ్యారు.భాను శ్రీ నాకు ఒక కోరిక ఉందని ఆ కోరిక ఏమిటంటే నీకు రాఖీ కట్టాలని ఉందని చెబుతారు.
నువ్వు రాఖీ కడితే నేను నిన్ను బ్రదర్ అని పిలవాల్సి వస్తుందని సుమ చెప్పగా భాను శ్రీ రివర్స్ లో పరవాలేదు అక్కా అని చెబుతారు.ఆ తర్వాత జాఫర్ ఇవన్నీ ప్రశ్నలు అని టిష్యూ పేపర్ పై రాసిన అక్షరాలను చూపించగా సుమ మీరు ఇవన్నీ బాత్ రూమ్ లో కూర్చుని రాశారా.? అంటూ పంచ్ వేస్తుంది.పండు సాకేత్ సిస్టర్ వైపు చూస్తూ ఆమె పేరు అడగగా ఆమె నాకేం పేరు లేదని చెబుతుంది.
వెంటనే సుమ ఈ షో మీరు మీ చెల్లెల్లతో ఆడటానికని వేరే వాళ్ల చెల్లెళ్లతో మాట్లాడటానికి కాదని చెబుతారు.
ఆ తర్వాత సాకేత్ ప్లేస్ లోకి పండు వెళ్లగా పండు ప్లేస్ లోకి సాకేత్ వచ్చారు.
రాఖీ స్పెషల్ అనుకుంటున్నారా.? లేక వాలెంటైన్స్ డే స్పెషల్ అనుకుంటున్నారా.? అంటూ పండు చెప్పుకొచ్చారు.పండు రాకేష్ ను బావ అని పిలవగా సిగ్గుండాలి అని సాకేత్ చెబుతాడు.
సాకేత్ సిస్టర్ పండుకు రాఖీ కట్టగా ఆ అవమానాన్ని భరించలేని పండు తన చెప్పుతో తననే కొట్టుకుంటాడు.
ఆ తర్వాత కాలేజ్ అమ్మాయిలు కూడా పండుకు రాఖీ కట్టడంతో పాటు పండన్న చెబుతారు.ఆ తర్వాత జాఫర్ తన పెద్దక్క గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.ఈ నెల 21వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండటం గమనార్హం.