నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తరువాత యాంకర్ గా మారి టెలివిజన్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి శ్రీముఖి.ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి కూడా ఒకరుగా ఉన్నారు.
ఆమె హవా ఆ రేంజ్ లో నడుస్తుంది.వరుసపెట్టి షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.
ఇక ఈ మధ్య బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని రన్నరఫ్ గా శ్రీ ముఖి నిలిచింది.కొద్దిలో టైటిల్ విన్నర్ గా అవకాశం కోల్పోయిన బిగ్ బాస్ తో ఈ భామ ఇమేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది.
అంతకు ముందు యాంకర్ గా ఉన్న అభిమానులు కంటే బిగ్ బాస్ తర్వాత ఆమెకి అభిమానులు ఎక్కువయ్యారు.అయితే ఇప్పుడు ఈ అభిమానులతో శ్రీముఖి తెగ విసిగిపోతుందని తెలుస్తుంది.
ఈమెకి పెరిగిన ఫాలోయింగ్ తో అభిమానులు శ్రీముఖి ఇంటి అడ్రెస్ కనుక్కొని నేరుగా అక్కడికే వచ్చి ఆమె కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.అలాగే ఎక్కడ కనిపించిన సెల్ఫీలు అంటూ మీద పడిపోతున్నారని దీని వలన చాలా ఇబ్బందికరంగా ఉంటుందని శ్రిముఖి తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు సమాచారం అసలే ఫుల్ బిజీ షెడ్యూల్ తో వరుస షోలు చేసుకుంటూ అలసిపోయి వస్తే అప్పుడు కూడా సెల్ఫీలు అంటూ వెంటపడటం, ఇబ్బందిపెట్టడంతో చాలా అసహనంగా ఉంటుందని అసంతృప్తి వ్యక్తి చేసింది.
అభిమానుల కోసం మేకప్ వేసుకొని ఎంత కష్టమైన నవ్వుతూ షోలు చేస్తున్నా అని అయితే ఇంటికి కూడా వచ్చి వేధించడం భాగోలేదని బాధపడుతుంది.ఇంకా అభిమానం అంటూ హద్దులు మీటితే దానికి వేరే విధంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెబుతుంది.