యాంకర్ శ్రీముఖి.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బుల్లి తెరపై ఎప్పుడూ సరదాగా అందరిని నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది శ్రీముఖి.ఈ క్రమంలో శ్రీముఖి గ్లామర్ తో పాటు ఆమె కామెడీ పంచింగ్ టైంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.
శ్రీముఖి బిగ్ బాస్ 3 షో లో టైటిల్ చివరి నిమిషంలో సొంతం చేసుకోపోయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.ఎప్పటికప్పుడు రియాలిటీ షోలో ఈ భామకు సాటి ఎవరూ లేరు అన్న విధంగా శ్రీముఖికు మంచి గుర్తింపు వచ్చింది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి ఒక ప్రత్యేక స్థానం ఉందనే అనుకోవాలి.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబందించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది.
ఇటీవల కాలంలో ఒక న్యూస్ పేపర్ డిజైన్ తో వేసుకున్న ఔట్ ఫిట్ తో శ్రీముఖి అందాలు అందర్నీ ఆకట్టుకుంది.అటు బుల్లితెరపై మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటించే అవకాశాలతో ప్రస్తుతం శ్రీముఖి బిజీబిజీగా గడిపేస్తోంది.
ఇది ఇలా ఉండగా తాజాగా ఈటీవీ వారి మల్లెమాల ఈవెంట్ లో భాగంగా ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంది.జాతిరత్నాలు అనే పేరుతో ఈవెంట్ లో భాగంగా యాంకర్ గా శ్రీముఖి, ఢీ షో జడ్జ్ పూర్ణ ఇద్దరు కలిసి చిందులేసారు.
ఈ స్పెషల్ ఈవెంట్ కు ప్రత్యేక గెస్ట్ గా జబర్దస్త్ జడ్జ్ మనో కూడా వచ్చారు.ఈ క్రమంలో జడ్జ్ మనోకు అనుకోకుండా ఓ సంఘటన జరిగింది.ఒక్కసారిగా మనోకు ఒకవైపు శ్రీముఖి, మరోవైపు పూర్ణ ఇద్దరు కలిసి రెండు బుగ్గలపై ముద్దు పెట్టగానే షాక్ కు గురి అయ్యాడు.ఇక ఈవెంట్ ఉగాది పండుగ సందర్భంగా ఈటీవీ వారి నిర్వహిస్తున్నారు.
వాస్తవానికి ఈ స్పెషల్ ఈవెంట్ కోసం శ్రీముఖి చాలా అల్లరి చేసినట్లే కనబడుతోంది.ఈ జాతిరత్నాలు ఉగాది ఈవెంట్ కి మరో జడ్జిగా ప్రముఖ యాంకర్ ఉదయభాను రావడం విశేషం అని చెప్పాలి.
ఇందుకు సంబంధించి పూర్తి విశేషాలు తెలుసుకోవాలంటే ఉగాది వరకు వేచి చూడాల్సిందే.
.