తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అయితే ఒకప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల నిండా కమెడియన్లతో షో చూడటానికి ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది.
కానీ రాను రాను జబర్దస్త్ షో పూర్వం వైభవం కోల్పోతుంది.జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ క్రేజ్ అందుకున్న కమెడియన్ లో పెట్టడం జబర్దస్త్ లో వదిలేసి సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే పలువురు కమెడియన్లు సినిమాలలో అవకాశాలు సంపాదించుకొని సినిమాలకే పరిమితం కావాలి అని ప్రయత్నిస్తున్నారు.కాగా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షో పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
షో నిర్వాహకులతో విభేదాల కారణంగానే కమెడియన్లు ఒక్కొక్కరుగా జబర్దస్త్ ను వీడి వెళ్ళిపోతున్నారని కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే.ఇక ఇటీవల అనసూయ వెళ్ళిపోయినప్పుడు కూడా అటువంటి వార్తలే వినిపించాయి.
కాగా అనసూయ వెళ్ళిపోయిన తరువాత చాలామంది స్థానంలోకి కొత్త యాంకర్ ని తీసుకువస్తారు అని భావించారు.షో నిర్వాహకులు కూడా కొత్త యాంకర్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే బుల్లితెరపై టాప్ యాంకర్స్ గా రాణిస్తున్న పలువురు యాంకర్ లను సంప్రదించగా వారు చేయము అని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.అలాగే జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు అన్న విషయంపై అనేక రకాల రూమర్స్ కూడా వినిపించాయి.
ఈ క్రమంలోనే మొదటగా షో నిర్వహకులు యాంకర్ శ్రీముఖిని సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి.
అయితే శ్రీముఖికి 2013 లోనే జబర్దస్త్ షోకి యాంకర్ గా చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆమె అప్పుడు ఒప్పుకోలేదు.అప్పుడే ఒకసారి రిజెక్ట్ చేసిన శ్రీముఖిని తాజాగా మరొకసారి అనసూయ వెళ్ళిపోయిన తర్వాత కూడా సంప్రదించారట.ఈసారి కూడా శ్రీముఖి ఒప్పుకోలేదని తెలుస్తోంది.
దీంతో కొత్త యాంకర్ విషయంలో విసిగిపోయిన షో నిర్వాహకులు రష్మిని రంగంలోకి దింపారు.కాగా ప్రస్తుతం రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
దాంతో రష్మీ నే జబర్దస్త్ కి,ఎక్స్ ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా నియమించేశారు.మరొకవైపు యాంకర్ శ్రీముఖి ఎందుకు రిజెక్ట్ చేసింది అన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే శ్రీముఖి డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం వల్లే ఆమె నో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.