బుల్లితెర యాంకర్, సినీనటి శ్రీముఖి గురించి అందరికీ తెలిసిందే.ఆమె వెండితెర కంటే బుల్లితెర పైనే ఎక్కువ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న యాంకర్ లలో శ్రీముఖి చేసే సందడి మాత్రం అంతా ఇంతా కాదు.అనసూయ, రష్మీ ల కంటే గ్లామర్ ను మించిపోతున్న శ్రీముఖి.
యాంకర్ లిస్టులో టాప్ ఫైవ్ లో ఉంది.
ఇక వెండి తెరపై కొన్ని సినిమాల్లో నటించగా.
కొన్ని పాత్రలతో బాగా మెప్పించింది శ్రీముఖి.అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ లో కూడా శ్రీముఖి చివరి వరకు పాల్గొని రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా లోనే కాకుండా.తెగ ట్రిప్స్ లు కూడా చేయడంలో బిజీగా ఉంటుంది.
తాజాగా శ్రీముఖి ఫార్మ్ హౌస్ లో వీకెండ్ ప్లాన్ చేసుకుంది.
కొంపల్లి దగ్గర ఫార్మ్ హౌస్ కి వెళ్ళిన శ్రీముఖి అక్కడ నైట్ డిన్నర్, స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడుతూ తెగ ఎంజాయ్ చేసింది.అంతేకాకుండా అక్కడ కొన్ని ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో పంచుకుంది.తన సొంత ఊరు నుండి వాళ్ళ అమ్మ రావడంతో శ్రీముఖి ఈవెంట్ ను ప్లాన్ చేయగా.
తన సోదరుడు, తల్లి, స్నేహితులతో కలిసి శ్రీముఖి ఫార్మ్ హౌస్ లో తెగ ఎంజాయ్ చేస్తూ గడిపింది.ఆ మధ్య శ్రీముఖి తన ఫ్రెండ్స్ విష్ణు ప్రియ, అరియానా తో కలసి గోవా కి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఎక్కడ తాము చేసిన సందడి లను శ్రీముఖి సోషల్ మీడియాలో ఇక షేర్ చేసింది.ఇక శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.