బుల్లితెర స్టార్ యాంకర్ గా శ్రీముఖికి మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో తక్కువ సంఖ్యలో షోలు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి హవా కొనసాగుతోంది.
అందం, అల్లరితో ప్రేక్షకులను ఆకట్టుకునే టాలెంట్ ఉన్న శ్రీముఖి పలు ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తుండటం గమనార్హం.పటాస్ షో ద్వారా శ్రీముఖి బుల్లితెర రాములమ్మగా పేరును సొంతం చేసుకున్నారు.
శ్రీముఖికి తమ్ముడు సుప్రీత్ అంటే ఎంతో ఇష్టం కాగా తమ్ముడికి శ్రీముఖి ఖరీదైన ఫోర్డ్ కారును బహుమతిగా ఇచ్చారు.శ్రీముఖి తమ్ముడికి కారు ఇచ్చిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
నెటిజన్లు శ్రీముఖికి, అతని తమ్ముడికి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు.అయితే కొంతమంది మాత్రం శ్రీముఖిని ట్రోల్ చేస్తున్నారు.
ఫోర్డ్ కంపెనీ భారత్ లో కార్యకలాపాలను నిలిపివేస్తామని ప్రకటన చేసిందని ఆ కంపెనీ కారును ఎందుకు కొనుగోలు చేశావంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.ఈ కారు ధర 33 లక్షల రూపాయలు అని తెలుస్తోంది.శ్రీముఖి తమ్ముడికి ఖరీదైన బహుమతిని ఇవ్వడం గమనార్హం.మరోవైపు శ్రీముఖి పలు ఈవెంట్లు, షోలకు అతిథిగా హాజరవుతున్నా హోస్ట్ గా షోలు చేయడం లేదు.
శ్రీముఖి హోస్ట్ గా బిజీ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారుపటాస్ షో ద్వారా శ్రీముఖికి పాపులారిటీ పెరగగా బిగ్ బాస్ షో ఆ పాపులారిటీని రెట్టింపు చేసింది.కొత్త కారుతో శ్రీముఖి, ఆమె తమ్ముడు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం శ్రీముఖి చేతిలో కామెడీ స్టార్స్ షో మాత్రమే ఉండగా ఆ షోకు ఆశించిన స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లు రావడం లేదు.