తెలుగులో ప్రముఖ రియాల్టీ గేమ్స్ ఆయన బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ న్యూస్ యాంకర్ శివ జ్యోతి గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అంతకు ముందుగా శివ జ్యోతి తీన్మార్ వార్తలు అంటూ సత్తి తో కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
దీంతో ప్రస్తుతం శివ జ్యోతి ఒక పక్క న్యూస్ యాంకర్ గా, మరోపక్క పలు షోలు, ఈవెంట్లలో నటిస్తూ బాగానే రాణిస్తోంది.అయితే తాజాగా యాంకర్ శివ జ్యోతి ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులలో పంచుకుంది.
ఇందులో భాగంగా తాను బిగ్ బాస్ షో కి వెళ్లేముందు కొంతమేర భయపడ్డానని కానీ తన భర్త ధైర్యం చెప్పడంతో బాగానే ఆడానని తెలిపింది.అంతేగాక ఈ షోలో ఎప్పుడూ కూడా తాను ఆట పరంగా ఎవరిని నొప్పించలేదని సాధ్యమైనంతవరకు అందరితోనూ చాలా మంచిగా మెలిగానని తెలిపింది.
తనకు ఇష్టమైన కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతుంటే బాధగా ఉండేదని అందువల్లనే ఎక్కువగా ఏడ్చేదాన్ని కూడా స్పష్టం చేసింది.కానీ బిగ్ బాస్ ఎక్కువగా తన ఏడుపుని ప్రజలకు చూపించారని దాంతో అందరూ తాను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటానని అనుకున్నారని కూడా తెలిపింది.
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లతో తన ప్రవర్తన గురించి స్పందిస్తూ తాను సాధ్యమైనంతవరకు అందరితోనూ చాలా మంచిగా ఉంటానని ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు లేదా తనని నొప్పించే సంఘటనలు జరిగితే వెంటనే వారి నుంచి దూరంగా వెళ్ళిపోతానని మరోమారు మాట మాట్లాడే ప్రయత్నం కూడా చేయనని తెలిపింది.అంతేకాక తాను ఎవరినైనా ఏదైనా ఉద్దేశించి మాట్లాడాలంటే కనీసం పది సెకండ్ల పాటు ఆలోచించి మాట్లాడతానని అంతే తప్ప నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఎదుటి వారిని నొప్పించలేనని చెప్పుకొచ్చింది.
అలాగే వృత్తి పరంగా తనకు ఎలాంటి లక్ష్యాలు లేవని తాను బ్రతికున్నంత కాలం కష్టపడి పని చేస్తూ ఉండాలని అదే తన జీవిత లక్ష్యమని తెలిపింది.అలాగే తనకు తన ఇల్లు అంటే చాలా ఇష్టమని అందువల్లనే ఎప్పుడూ చాలా పరిశుభ్రంగా ఉంచుతానని కూడా చెప్పుకొచ్చింది.
కాగా ప్రస్తుతం యాంకర్ శివ జ్యోతి న్యూస్ రీడర్ గా పని చేస్తోంది.