స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన మా ఊరి వంట కార్యక్రమం ద్వారా యాంకర్ శ్యామల తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.అయితే శ్యామల భర్త నరసింహారెడ్డి చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఒక మహిళ నరసింహారెడ్డి తన దగ్గర నుంచి విడతల వారీగా కోటి రూపాయలు తీసుకున్నారని ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనకు నరసింహారెడ్డికి మధ్య ఒక మహిళ రాయభారం నడిపిందని మోసపోయిన మహిళ ఫిర్యాదు చేయగా రాయబారం నడిపిన మహిళను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఈ వ్యవహారం గురించి యాంకర్ శ్యామల స్పందిస్తూ తన భర్తపై ఎవరో తప్పుడు కేసు పెట్టారని తన భర్త ఎటువంటి తప్పు చేయలేదని అన్నారు.తాను టీవీ చూసి ఈ విషయం తెలుసుకున్నానని తన భర్తపై చేస్తున్న ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అని కచ్చితంగా చెప్పగలనని ఆమె తెలిపారు.
డబ్బుల కొరకు తన భర్త ఆడపిల్లను మోసం చెయ్యరని తన భర్త వ్యక్తిత్వం గురించి తనకు బాగా తెలుసని శ్యామల చెప్పుకొచ్చారు.తన పెళ్లి జరిగి పది సంవత్సరాలు అయిందని డబ్బు కోసం అమ్మాయిలతో ఆడుకునే క్యారెక్టర్ తన భర్తది కాదని ఆమె పేర్కొన్నారు.తాను ప్రస్తుతం జ్వరంతో బాధ పడుతున్నానని ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదని శ్యామల వెల్లడించారు.తనకు కొంచెం సమయం ఇస్తే ఏం జరిగిందో తెలుసుకుంటానని శ్యామల పేర్కొన్నారు.
తన భర్తకు తాను మద్దతు ఇస్తానని పోలీసుల నుంచి తనకు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదని ఆమె చెప్పుకొచ్చారు.తన భర్తపై నమోదైన కేసు తప్పుడు కేసు కాబట్టి తాను కంగారు పడటం లేదని శ్యామల వెల్లడించారు.