బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని ప్రేక్షకులకు చేరువయ్యారు శివజ్యోతి(తీన్మార్ సావిత్రి).తీన్ మార్ న్యూస్ ప్రోగ్రామ్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న శివజ్యోతి టీవీ9 ఛానెల్ లో ఇస్మార్ట్ న్యూస్ అనే ప్రోగ్రామ్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
గతేడాది కొత్త ఇల్లు కొనుగోలు చేసిన శివజ్యోతి ఈ ఏడాది కొత్త కారును కూడా కొనుగోలు చేశారు.శివజ్యోతి ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తున్నారు.
ఈ నెల 8వ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాగా ఉమెన్స్ డే సందర్భంగా జీ తెలుగు ఛానెల్ నిర్వాహకులు “మగువా లోకానికి తెలుసా నీ విలువ” పేరుతో ఒక షోను ప్రసారం చేస్తున్నారు.ఈ షో ప్రోమోలో శివజ్యోతి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
భర్త గురించి మాట్లాడుతూ శివజ్యోతి కన్నీళ్లు పెట్టుకున్నారు.భర్త గంగూలీ గురించి వస్తున్న కామెంట్ల గురించి మాట్లాడుతూ శివజ్యోతి ఎమోషనల్ అయ్యారు.
శివంగివే శివంగివే పాటకు డ్యాన్స్ చేసిన సావిత్రి “నా తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉందనుకోండి.ఆమె ఎక్కువ మొత్తం సంపాదిస్తుందనుకోండి.తెలీకుండానే ఫ్రెండ్స్, ఫ్యామిలీ దానికేందిరా సంపాదిస్తుంది దాని మొగుడు కూర్చొని తింటుండు” అంటారని మీరు అనుకున్నంత ఈజీగా మా జీవితాలు ఉండవంటూ శివజ్యోతి కన్నీళ్లు పెట్టుకున్నారు.
కొంతమంది ఇలా చేయడం ద్వారా సపోర్ట్ చేసేవాళ్లను తెలీకుండానే కింద పడేస్తున్నట్టు అనిపిస్తుందని ఆమె అన్నారు.
కుటుంబంలో భర్త కంటే భార్య ఎక్కువ మొత్తం సంపాదిస్తే కొంతమంది భర్తను అవమానించేలా మాట్లాడటం గురించి శివజ్యోతి ఈ షోలో చెప్పుకొచ్చారు.ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు జీ తెలుగు ఛానల్ లో ఈ షో ప్రసారం కానుంది.