బుల్లితెర జోడీ రష్మీ సుధీర్ ఒకరిపై మరొకరు వేసుకునే పంచ్ లు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటాయనే సంగతి తెలిసిందే.రోజురోజుకు రష్మీ సుధీర్ జోడీకి ప్రేక్షకుల్లో పాపులారిటీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
కొత్తగా బుల్లితెర జోడీలు ఎంట్రీ ఇచ్చి పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా రష్మీ సుధీర్ జోడీకీ కొత్త జోడీలు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతూ ఉండటం గమనార్హం.అయితే తాజాగా రష్మీ సుధీర్ పై షాకింగ్ కామెంట్లు చేశారు.
ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో రష్మీ సుధీర్ పై పంచ్ లు వేయడం గమనార్హం.సర్జరీలు చేయించుకొని కోలుకున్న రోజా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
సుడిగాలి సుధీర్ పొట్టి నరేష్ ను టీవీ తీసుకున్నావా ఈ.ఎం.ఐలు కట్టి నాలుగు నెలలైంది అని చెబుతాడు.నరేష్ మా ఇంట్లో బాదం పాలు బాగుంటాయని చెప్పగా బాదంపాలు తెప్పించు తర్వాత ఈ.ఎం.ఐ గురించి మాట్లాడదాం అంటాడు.
లేడీ గెటప్ లో ఉన్న బుల్లెట్ భాస్కర్ ఎవరు ఈయన ? అని నరేష్ ను అడగగా రోజా సొరంగాల సుదీర్ అని చెబుతుండగానే రష్మీ తవ్వీతవ్వీ వచ్చేశాడు అంటూ సుధీర్ పై పంచ్ వేశారు.ఆ తరువాత సుధీర్ మరో స్కిట్ లో లాక్ డౌన్ పనికొస్తాయ్ అని చెప్పగా సుధీర్ ముదిరిపోయిన బెండకాయలు ఏరుకుంటాడంటూ రష్మీ షాకింగ్ కామెంట్లు చేశారు.సుధీర్ పోకిరిలో మహేష్ చెబుతుంటే రష్మీ సుధీర్ పండుగాడు కాదు దిండుగాడు అని చెబుతుంది.
ఆ తరువాత రష్మీ బర్త్ డే సందర్భంగా సుధీర్ స్పెషల్ స్కిట్ చేశాడు.రష్మీ తనకోసమే పుట్టిందని సుధీర్ చెప్పుకొచ్చారు.పండుగకు సెలవు ఇవ్వాలని రష్మీ బర్త్ డేకు మించి పండుగ ఏది ఉంటుందని సుధీర్ వెల్లడించారు.