తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ను ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.
ఎంతోమంది కమెడియన్ లు ఈ జబర్దస్త్ స్టేజ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని వెండితెర పై కూడా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఇకపోతే జబర్దస్త్ పూర్వ వైభవం కోల్పోతోంది అన్న విషయం తెలిసిందే.
జబర్దస్త్ నుంచి ఒక్కొక్క కమిడియన్ వెళ్ళిపోతున్నారు.ఇప్పటికే జబర్దస్త్ నుంచి టాప్ కమెడియన్లు అయినా సుడిగాలి సుదీర్, శ్రీను, హైపర్ ఆది లాంటి వారు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.
అలాగే జబర్దస్త్ జడ్జ్ రోజా కూడా మంత్రి పదవి దక్కడంతో వెళ్లిపోయిన విషయం తెలిసిందే.కాగా ఇటీవలె జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ ను వీడి వెళ్ళిపోయింది.
జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ కీ రష్మీ యాంకర్ లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇటీవలే యాంకర్ అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి యాంకర్ రష్మీ వచ్చి చేరింది.
అయితే అనసూయ బదులుగా జబర్దస్త్ యాంకర్ గా కొత్త యాంకర్ ను తీసుకురావడానికి జబర్దస్త్ మల్లెమాల టీం గట్టిగానే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా ఆ కొత్త యాంకర్ ఎవరో చెప్పకుండా బుల్లితెర ప్రేక్షకులను ఆసక్తిని పెంచుతూ వచ్చారు.
గతవారం అనసూయ ప్లేస్ లోకి రాబోతున్న కొత్త యాంకర్ అంటూ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచి టిఆర్పిని పెంచే ప్లాన్ చేసింది.ఈ నేపథ్యంలోనే యాంకర్ రష్మీ ని ఒక పల్లకిలో మోసుకొస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు.కమెడియన్లు కూడా ఆ కొత్త యాంకర్ ఎవరో తెలుసుకోవడానికి కుతూహలంగా వెయిట్ చేశారు.కానీ ఆ యాంకర్ ముసుగు తీయడంతో అసలు విషయం బయటపడింది.ఆ కొత్త యాంకర్ మరెవరో కాదు రష్మీనే.ఈ విషయాన్ని మల్లెమాలవారు చెప్పకుండా బిల్డప్ ఇచ్చి స్టేజి పైకి తీసుకొని వచ్చిన తర్వాత ఇలా రష్మీ ని చూపించడంతో ప్రేక్షకులు బాగా డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే గురువారం,,శుక్రవారం రష్మీ నేనా అంటూ పెదవి విరుస్తుండగా ఇటువంటి సమయంలో కొత్త యాంకర్ అంటూ బిల్డప్ ఇచ్చి ఈ విధంగా డిసప్పాయింట్ చేయడంతో ప్రేక్షకులు మండిపడుతున్నారు.