ఈమధ్య టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్ నిత్యం ఏదో ఒక విషయంలో కామెంట్లు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.ఇటీవలే టాలీవుడ్ లో కరోనా వైరస్ వల్ల మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్నటువంటి “ఆచార్య” చిత్ర షూటింగ్ ని కొంతకాలం పాటు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
తాజాగా ఈ అమ్మడు ఈ విషయంపై స్పందించింది.
ఇందులో భాగంగా ఇలా షూటింగులను వాయిదా వేయడం మెగాస్టార్ చిరంజీవి వల్ల అవుతుందేమో కానీ తమ లాంటి చిన్న చిన్న ఆర్టిస్టుల వల్ల కాదని చెప్పుకొచ్చింది.
అంతేకాక తనలాంటి ఆర్టిస్టులు ప్రొడక్షన్ కంపెనీలతో కాంట్రాక్ట్ అనుసంధానం కలిగి ఉంటాయమని ఒకవేళ ప్రొడక్షన్ కంపెనీ వాళ్లు సెలవులు ఇస్తే తప్ప తాము సెలవులు తీసుకోలేమని చెప్పుకొచ్చింది.ఒకవేళ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు కనుక సెలవు ఇవ్వకపోతే ఎటువంటి పరిస్థితులనైనా షూటింగులకు తప్పకుండా హాజరుకావాలని అంటోంది ఈ అమ్మడు.
అంతేగాక ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్ మహమ్మారినీ అరికట్టేందుకు తన అభిమానులకి తగిన సూచనలు కూడా ఇస్తోంది.ఇందులో భాగంగా ముందుగా కరోనా వైరస్ గురించి అందరూ భయపడటం మానేసి ఆ వైరస్ రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి అపాయం ఉండదని అంటోంది.జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కనీసం మూడు అడుగుల దూరం ఉంటూ మాట్లాడాలని, అలాగే చేతులు కాళ్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రష్మి గౌతమ్ ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి ఎక్స్ ట్రా జబర్దస్త్ మరియు డీ జోడి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది.
మరోపక్క ఇటీవలే ఓ కొత్త చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.