బుల్లితెర జోడీగా పేరు తెచ్చుకున్న రష్మీ సుధీర్ జోడీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సుధీర్ ఫ్యాన్స్ తో పాటు రష్మీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్న సంగతి తెలిసిందే.సుధీర్, రష్మీ వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ కావడంతో ఆయా యాంకర్లకు కూడా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అయితే తా జాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో సుధీర్ రష్మీ పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టమే అని కామెంట్లు చేయడం గమనార్హం.
తాజాగా రిలీజైన ప్రోమోలో రాకేష్ మాస్టర్ సుడిగాలి సుధీర్ ను ఎవరినైనా లవ్ చేశావా ? అని ప్రశ్నిస్తాడు.ఆ ప్రశ్నకు సుడిగాలి సుధీర్ తాను ఎవరినీ లవ్ చేయలేదని ఒక అమ్మాయి మాత్రం తన వెంట పడుతోందని చెప్పారు.అలా చెప్పడంతో సిగ్గు పడిన రష్మీ జడ్జి రోజాను తాను సుధీర్ వెంట పడ్డానా ? అని అడిగారు.ఆ తరువాత రాకేష్ మాస్టర్ ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు కదా ? అని సుడిగాలి సుధీర్ కు సూచిస్తారు.
ఆ తరువాత సుధీర్ తో పెళ్లి ఇష్టమేనా ? అని రాకేష్ మాస్టర్ రష్మీని అడగగా ఆమె ఇష్టమే అని చెబుతారు.ఆ తరువాత సుధీర్ కూడా తనకు పెళ్లి ఇష్టమే అని చెబుతాడు.ఈ శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
రాకేష్ మాస్టర్ రష్మీ సుధీర్ జోడీని కలపగా రియల్ లైఫ్ లో కూడా ఈ జోడీ పెళ్లి చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.అయితే జబర్దస్త్ కమెడియన్లు ఇంటర్వ్యూల్లో మాత్రం సుధీర్ రష్మీ మధ్య ఏం లేదని చెబుతున్నారు.
రష్మీ సుధీర్ డైరెక్టర్ స్క్రిప్ట్ ప్రకారమే అలా నటిస్తున్నారని అంతకు మించి వాళ్లిద్దరి మధ్య ఏం లేదని చాలా సందర్భాల్లో జబర్దస్త్ కమెడియన్లు చెప్పుకొచ్చారు.