యాంకర్ రష్మి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.ఈమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మి కూడా ఒకరు.ఈమె ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి యాంకర్ గా చేస్తోంది.
రష్మి కి స్టార్ హీరోయిన్లతో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉంది అంటే అతియోశక్తి కాదు.ఇక ఈమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మెగా ఫ్యాన్స్ ఈమెను చూడటానికి భారీగా తరలి వస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె చిత్తూరు జిల్లాలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభించడానికి వచ్చింది.షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రష్మీ ని చూసేందుకు భారీగా జనం వచ్చారు.
ఇక ఆ ప్రాంతం ఒక్కసారిగా రద్దీగా మారిపోయింది.రష్మీ తో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడటంతో వారిని అదుపు చేయడం షాపింగ్ మాల్స్ సిబ్బంది వల్ల కాలేకపోయింది.
దీంతో అక్కడ కొద్దిసేపు తోపులాట గందరగోళ పరిస్థితి కనిపించింది.
కొంతమంది ఆకతాయిలు అయితే రష్మీ మీదికి దూసుకు వచ్చారు.ఆమెను తాకేందుకు ప్రయత్నించారు అయినా కూడా రష్మీ అసహనానికి గురి కాకుండా నవ్వుతూనే అభిమానులకు సర్ది చెప్పింది.ఆ గందరగోళ పరిస్థితులలో రిబ్బన్ కట్ చేయడానికి కూడా రష్మి కి వీలు పడలేదు.
జనం తోపులాట మధ్య నుంచి షాపింగ్ మాల్ కు అడుగుపెట్టిన రష్మి జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించింది.