బుల్లితెర యాంకర్ రష్మీ వయస్సు పెరుగుతున్నా ఇతర యాంకర్లు పెళ్లి చేసుకుంటున్నా పెళ్లిపై మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ సెలబ్రిటీలలో యాంకర్ రష్మీ ఒకరని చెప్పవచ్చు.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా నటించని బుల్లితెరపై మాత్రం షోలతో పాటు ఈవెంట్లలో కూడా కనిపిస్తూ యాంకర్ గా తన స్థాయిని పెంచుకుంటున్నారు.
తాజాగా రష్మీ గౌతమ్ ఢీ షోలో హాట్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా రష్మీ గౌతమ్ మాట్లాడుతూ హీరోలు ఎంత అందంగా ఉన్నప్పటికీ వాళ్ల పోస్టర్ గోడపై మాత్రమే ఉంటుందని టెడ్డీబేర్ ఎప్పుడూ బెడ్ పైనే ఉంటుందని రష్మీ గౌతమ్ చెప్పుకొచ్చారు.చైతన్య మాస్టర్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతూ రష్మీ ఈ కామెంట్లు చేయగా చైతన్య మాస్టర్ తెగ సిగ్గుపడ్డారు.
ప్రోమోలో ప్రదీప్ ఆటోతో ఎంట్రీ ఇవ్వగా ప్రదీప్ పిలిచి చూడు వస్తుందేమో అనగా ఆది నువ్వు పిలువు అన్నా ఏది రాదో నేను చూస్తాను అని చెబుతాడు.సుధీర్ షేర్ ఆటోలా అందరినీ ఎక్కించుకుంటే కుదరదని మేము ఇద్దరమే ఉంటామని చెప్పగా ప్రదీప్ మీకు స్టార్ట్ చేయడం వచ్చా అని సుధీర్ ను అడుగుతాడు.మీరు స్టార్ట్ చేస్తే చాలని మిగతాది నేను చూసుకుంటానని ప్రదీప్ చెబుతాడు.
ఆ తర్వాత కనీసం ఆపడం అయినా మీకు వచ్చా అంటూ ప్రదీప్ సుధీర్ ను ప్రశ్నిస్తాడు.ప్రదీప్ వెంటనే అందుకోసం మీరు కాలు బయటపెడితే చాలని చెప్పుకొస్తారు.కొరియోగ్రాఫర్, కంటెస్టెంట్ కలిసి డ్యాన్సులు చేసిన ప్రోమోకు రికార్డు స్థాయిలో 25 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.
ఆగష్టు 4వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండటం గమనార్హం.