బుల్లితెర జోడీలలో ఒకటైన రష్మీ, సుధీర్ జోడీకి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సుధీర్, రష్మీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో వీళ్లిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తూ ఉంటాయి.
పలు సందర్భాల్లో రష్మీ, సుధీర్ తాము ప్రేమించుకోవడం లేదని షో కోసమే అలా యాక్ట్ చేస్తామని చెప్పినా సుధీర్ రష్మీ మధ్య ఏదో ఉందని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విడివిడిగా రష్మీ, సుధీర్ ప్రోగ్రామ్స్ చేసినా ఆ ప్రోగ్రామ్స్ పెద్దగా అలరించకపోవడంతో వీళ్లిద్దరూ జంటగా ఉండేలా నిర్వాహకులు ప్రోగ్రామ్స్ ను ప్లాన్ చేస్తున్నారు.
సుధీర్ సైతం పలు సందర్భాల్లో తాను కెరీర్ లో సక్సెస్ కావడం వెనుక రష్మీ పాత్ర ఎంతో ఉందని చెప్పారు.
ఈటీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఢీ షోకు సుధీర్, రష్మీ టీం లీడర్లుగా వ్యవహరిస్తున్నారు.ఢీ ఛాంపియన్స్ షోకు సుధీర్, రష్మీ ఒకే టీమ్ లో ఉండగా ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షోలో మాత్రం సుధీర్, రష్మీ వేరువేరు టీమ్స్ లో ఉన్నారు.ఢీ 13లో సుధీర్, హైపర్ ఆది ఒక టీంలో, రష్మీ టిక్ టాక్ ఫేమ్ దీపికా పిల్లి మరో టీంలో ఉన్నారు.
టీమ్స్ వేరు కావడంపై రష్మీ స్పందిస్తూ టీమ్స్ వేరైనా మేమంతా ఒక్కటే అని కామెంట్లు చేసింది.
ఆ తరువాత సుధీర్ “నిన్ను కొంచెం మిస్ అవుతున్నా” అని రష్మీ కామెంట్లు చేసింది.
రష్మీ అలా చెప్పగానే సుధీర్ “నేను కూడా నిన్ను మిస్ అవుతున్నా లక్కీ ఛార్మ్” అంటూ కామెంట్లు చేశాడు.ప్రోమోలో హైపర్ ఆది రష్మీ, సుధీర్ జంటకు పెళ్లి చేసేయండి నాన్న అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.