బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి పలు చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది.ఈ క్రమంలోనే ఈమె బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతుంది.
ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్.
ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు.
ఇకపోతే మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమాలో ఐటమ్ సాంగ్ కీలకంగా మారనుంది.ఈ పాటలో నటించడానికి స్టార్ హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు.
మరి మెగాస్టార్ ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించే అవకాశాన్ని బుల్లితెర యాంకర్ రష్మి దక్కించుకున్నారు.
ఈ సినిమాలో ఐటం సాంగ్లో నటించడం కోసం రష్మీ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని, ఈమె డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు కూడా సరే అన్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే రష్మీ ఈ పాటకోసం మూడు రోజుల కాల్షీట్స్ ఇవ్వగా అందుకోసం ఈమె కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తోంది.ఈ పాట కోసం ఏకంగా 1.5 కోట్ల భారీ సెట్ వేసి చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.