ప్రముఖ టెలివిజన్ యాంకర్ రష్మి నిన్న రాత్రి వైజాగ్ లో రోడ్డు ఆక్సిడెంట్ చేసి ఓ వ్యక్తి గాయాలకి కారణం అయ్యింది.ఈ వార్త కాస్తా బయటకి రావడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది.
అసలు విషయంలోకి వెళ్తే రష్మి సొంత ఊరు వైజాగ్ అన్న విషయం అందరికి తెలిసిందే.నిన్న రాత్రి వైజాగ్ లో తన ఇంటికి కారులో వెళ్తున్న సమయంలో కూర్మన్న పాలెం సమీపంలో రష్మి ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని డీకొట్టాడు.
ఈ ప్రమాదంలో బాధితుడుకి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది.అయితే యాక్సిడెంట్ కి గురైన బాధితుడుని స్థానికులు సమీపంలో గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించినట్లు తెలుస్తుంది.
అనంతరం మెరుగైన వైద్యం కోసం సిటీలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.ఇప్పుడు సంఘటన ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది.