కొన్ని రోజుల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన ఒక యువతి ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై 139 మంది అత్యాచారంకు పాల్పడ్డట్లుగా ఫిర్యాదు చేసింది.ఆమె చెప్పిన వివరాల ప్రకారం వంద పేజీలకు పైగా ఎఫ్ ఐ ఆర్ ను పోలీసులు రెడీ చేశారు.
ఆందులో ప్రముఖుల పేర్లు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా యాంకర్ ప్రదీప్ పేరు అందులో ఉందనే వార్త దావానంలా వ్యాప్తి చెందుతుంది.
ఈ విషయంలో ఆయన గురించి యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వార్తలు రాస్తున్నారు.దాంతో ఆయన స్పందించాడు.
మీడియాలో వస్తున్న వార్తలు నాకు తీవ్ర మనో వేదనకు గురి చేశాయి.ఇలాంటి విషయాల్లో కాస్త సంయమనం పాటించి వార్తలు రాస్తే బాగుంటుందని అన్నాడు.ఒక కుంటుంబంకు సంబంధించిన ఇష్యూ ఇది.ఒక మహిళ జీవితానికి సంబంధించిన విషయం ఇది అయినప్పుడు ఎలా ఇష్టానుసారంగా వార్తలు రాస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తారు.వ్యూస్ పెంచుకోవడం కోసం రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఇతరుల జీవితాలను తాకట్టు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని త్వరలోనే ఆ విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందని ఆయన అన్నాడు.