ప్రస్తుత కాలంలో బులితెర వెండి తెరకు పోటీగా దూసుకెళ్తోంది.ఇంకా చెప్పాలంటే సిల్వర్ స్క్రీన్ మించి జనాల్లోకి వెళ్తోంది.
డాన్స్, కామెడీ, రియాలిటీ షోలతో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.పలు షోలలో పాల్గొనే కంటెస్టెంట్లు అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీలుగా మారుతున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్లుగా ఎదుగుతున్నారు.మంచి రెమ్యునరేషన్ తో పాటు పేరు, గుర్తింపు పొందుతున్నారు.
మరికొన్ని షోలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా ఉన్నట్లు చెప్తున్నారు ఆయా షోలలో పాల్గొన్న కంటెస్టెంట్లు.రెమ్యునరేషన్ సంగతి పక్కన పెడితే గెలిచిన ప్రైజ్ మనీ కూడా కొందరు మింగేశారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా ఆట డాన్స్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ సన్నీ పలు సంచనల విషయాలు బయటపెట్టాడు.
గతంలో జీతెలుగులో ఓంకార్ యాంకర్ గా ఆట అనే డాన్స్ షో వచ్చింది.ఈ షోకు సుందరం మాస్టర్, అమ్మ రాజశేఖర్, నటరాజ్ జడ్జీలుగా ఉన్నారు.భరత్, సన్నీ, సందీప్, తేజు లాంటి డ్యాన్సర్లు తమ అద్భుత పర్ఫార్మెన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
చివరకు ఈ షో విన్నర్ గా సన్నీ నిలిచాడు.తాజాగా ఆయన కొన్ని విషయాలు బయటపెట్టాడు.
ఈ టీవీ డాన్స్ షో ఢీలో పాల్గొన్న కొరియోగ్రాఫర్లకు మంచి పేరు వచ్చిందని.ఆట ప్రోగ్రాంలో పాల్గొన్న తమకు మాత్రం ఎలాంటి అవకాశాలు రావడం లేదని చెప్పాడు.అంతేకాదు.ఆట5 షో విన్ అయినా.తమకు ప్రైజ్ మనీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.జీ చానల్ వాళ్లకి ఫోన్ చేసి అడగగా ఎవరో వచ్చి చెక్కు తీసుకున్నారని చెప్పారని తెలిపారు.తాము విన్ అయితే ఎవరికో చెక్ ఎలా ఇస్తారని సన్నీ ప్రశ్నించాడు.ఇక సీజన్ 6 లో కూడా ఇదే జరిగిందన్నాడు.
అటు ఓ కూలీ కొడుకు కూడా ఈ షోలో పాల్గొని విన్ అయినా తనకూ ఇప్పటి వరకు ప్రైజ్ మనీ ఇవ్వలేదన్నాడు.