తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన ఓంకార్ కరోనా బారిన పడ్డట్లుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.
ఓంకార్తో పాటు ఆయన తమ్ముడు ఇంకా ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరికి కూడా వైరస్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పెద్ద ఎత్తున ఈ విషయంమై వివాదాస్పదం అయ్యింది.
ఓంకార్తో పాటు ఇంకా కొందరు బుల్లి తెర వర్గాల వారికి కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది కనుక ఖచ్చితంగా షూటింగ్స్ను నిలిపేయాల్సిందే అంటూ కొందరు అన్నారు.ఇలాగే కొనసాగితే పరిస్థితి సీరియస్గా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల వారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
తీరా చూస్తే ఓంకార్ కరోన నిర్థారణ టెస్టు చేయించుకున్న విషయము నిజమే.కాని అది పాజిటివ్ రాలేదని నెగటివ్ వచ్చిందంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
చిన్న అనుమానంతో కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుంటే దానికి చాలా పెద్ద రాద్దాంతం చేసినట్లుగా కుటుంబ సభ్యులు సోషల్ మీడియా జనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓంకార్ విషయంలో మీడియాలో జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవం అతడికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇలాంటి పుకార్లను కొందరు పుట్టించారు అంటూ కుటుంబ సభ్యులు అన్నారు.
ఓంకార్ ఎలాంటి అనారోగ్యంతో లేడని ఆయన పూర్తి ఆరోగ్యంతో ప్రస్తుతం షూటింగ్కు కూడా రెడీ అవుతున్నాడు అంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.ఇస్మార్ట్ జోడీ షో మంచి రేటింగ్తో దూసుకు పోతుంది.మరో వైపు కొత్త సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ చేసే పనిలో ఓంకార్ ఉన్నాడట.ఈ సమయంలో ఆయన గురించి వచ్చిన పాజిటివ్ వార్తలు నిజం కాదని, ఆయన రిపోర్ట్ తారుమారు అయ్యి నెగటివ్ అయినా పాజిటివ్ అంటూ ప్రచారం జరిగిందని క్లారిటీ వచ్చేసింది.
ఓంకార్ తెలుగు బుల్లి తెరపై సెన్షేషన్ క్రియేట్ చేశాడు.ఆయన చేసిన కార్యక్రమాలు మరియు చేసిని సినిమాలు బుల్లి తెర మరియు వెండి తెరపై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ప్రస్తుతం ఆయన మాటీవీ కోసం ఇస్మార్ట్ జోడీ అనే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాడు.
లాక్డౌన్లో కూడ ఇస్మార్ట్ జోడీ రన్ చేసిన సత్తా ఉన్న షో మేకర్ ఓంకార్ కరోనా ప్రచారం బుల్లి తెర వర్గాల వారికి షాకింగ్గా ఉంది.
ఇప్పటికే బుల్లి తెరకు చెందిన కొందరు నటులు వైరస్ బారిన పడటంతో షూటింగ్స్ ఆపేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పుడు ఓంకార్ కు కూడా కరోనా అంటూ ప్రచారం అవ్వడం బుల్లి తెర వర్గాల వారిని కరోనా ఆందోళనకు గురి చేస్తోంది.ప్రస్తుతం షూటింగ్స్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్నాయి.కాని కేసులు ఇలాగే పెరిగేత మాత్రం షూటింగ్స్ కు బ్రేక్ పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.