యాంకర్ ఝాన్సీ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.ఒకానొక సమయంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉండేది.
టివి ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా, ఈవెంట్స్ కూడా చేస్తూ రెండు చేతుల సంపాదించేవారు.అయితే ఆ తర్వాత తర్వాత కొద్దిగా అవకాశాలు తగ్గుతూ వస్తున్నా కూడా ఈమె వచ్చిన అవకాశాలను వాడుకుంటూ సినిమాల్లో కూడా నటిగా కొనసాగుతూ వస్తున్నారు.
ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారనే విషయం ఆమెను ఫాలో అయ్యే వారికీ తెలుసు.ఈమె ఎప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.
ఇలా స్పందిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.తాజాగా ఝాన్సీ మరొక విషయంపై స్పందించారు.
ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఝాన్సీ మీడియాపై తనదైన శైలిలో క్లాస్ పీకారు.ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.”అనగనగ ఒక ఎద్దు, దానికో పుండు, ఆ పండులో పురుగులు.ఎద్దు పుండు కాకికి ముద్దు.కబుర్లు చప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులను తిని పండును పెద్దది చేసాయి.ఎద్దు రెచ్చి పోయింది.కాకులు గోల పెంచాయి.మైకులు పెట్టి మరి మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లెవా ?
సినిమా ఇంట్లో పెళ్లి అయినా.విడాకులు అయినా.ఎన్నికల అయినా లోకులకు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా.ప్రజా ప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీలో చూడండి”.అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.ఇది మీరు చూడాలని అనుకుంటున్నది కాదు.
వాళ్ళు బలవంతంగా చుపించాలనుకున్నదే మీకు చూపిస్తున్నారు.ఈ నాన్సెన్స్ కు దూరంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చింది.
ఈ కామెంట్స్ చేయడానికి కారణం.ఇటీవల కాలంలో మీడియా సమంత విడాకులపై పెట్టిన డిబేట్ లు.ఎన్నికలపై చూపిన అత్యుత్సాహం, అతి చొరవ చూసి ఝాన్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటుందని అంత అనుకుంటున్నారు.